ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్: వైద్యుల పర్యవేక్షణ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను 'కోవిడ్ సంబంధిత లక్షణాలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆసుపత్రి గురువారం మధ్యాహ్నం బులెటిన్ విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలో ఉండేందుకే ఆయన ఆస్పత్రిలో చేరారు.
అంతకుముందు, మంగళవారం తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని ఎంకే స్టాలిన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "నేను ఉదయం అలసిపోయాను. కాబట్టి, నేను కరోనావైరస్ కోసం పరీక్షించుకున్నాను. దీంతో నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ అయ్యింది. అందుకే నేను ఐసోలేషన్ లో ఉంటున్నాను. మనమందరం మాస్క్లు ధరించి, టీకాలు వేసుకుందాం, సురక్షితంగా ఉందాం" అని ట్విట్టర్ వేదికగా స్టాలిన్ పేర్కొన్నారు.

తాజా వివరాల ప్రకారం..
తేలికపాటి ఇన్ఫెక్షన్తో సీఎం సానుకూలంగా ఉన్నారని స్టాలిన్ వైద్యులు తెలిపారు. కానీ, తీవ్రమైన అనారోగ్య సమస్య ఏది లేదని చెప్పారు. సీఎం స్టాలిన్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.
సీఎం స్టాలిన్ గురువారం ఉదయం వరకు సాధారణంగానే ఉన్నారు, అయితే ఉదయం 8 గంటల సమయంలో ఆయనకు స్వల్పంగా గురక వచ్చింది. అతను CT స్కోర్ని తనిఖీ చేయడానికి, వైద్యుల పరిశీలనలో ఉండటానికి ఆసుపత్రిలో చేరారు.
Tamil Nadu Chief Minister MK Stalin admitted to a private hospital in Chennai for "investigation and observation for COVID19-related symptoms." pic.twitter.com/x8K3kThmXM
— ANI (@ANI) July 14, 2022
ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఆయన ఆస్పత్రికి వెళ్లే సమయంలో పీపీఈ కిట్ ధరించారు. ఇప్పుడు అతని ఆరోగ్యంగా నిలకడగానే ఉంది. CT స్కాన్, ఇతర పరీక్షలు చేయించుకుంటున్నారు. త్వరలో సీఎం స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం హెల్త్ అప్డేట్ విడుదల చేసింది.
మంగళవారం కోవిడ్ -19 కోసం పాజిటివ్ పరీక్షించిన తరువాత, 69 ఏళ్ల స్టాలిన్ తన నివాసంలో ఐషోలేషన్లో ఉన్రుడు. స్టాలిన్ అలసట, జ్వరం గురించి ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత అతనికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని సీఎంఓ తెలిపింది.












Click it and Unblock the Notifications