ఏ నిబంధనల ప్రకారం కరెన్సీ బ్యాన్ చేశారు?
న్యూఢిల్లీ: నవంబర్ 9, 2016 నుంచి రూ. 500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ గత మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, హఠాత్తుగా ఒకేసారి నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు మూడు పిటిషన్లను సుప్రీంకోర్టులు దాఖలు చేశారు.
నవంబర్ 15న సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై విచారించనుంది. ఇది ఇలా ఉండగా, కర్ణాటక హైకోర్టు తమ వద్ద దాఖలైన ఈ రకమైన పిటిషన్ల తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వవద్దని కోరుతూ సుప్రీంకోర్టులు కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే నోట్ల రద్దు విషయంలో ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారనే ప్నశ్న ఇప్పుడు అందరిలో మెదలుతోంది.
నిబంధనలు: రూ.500, 1000 నోట్ల రద్దు ప్రకటన
- భారత ప్రభుత్వం ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ ఎఫ్.నెం. 10/3/2016-సీవైI తేదీ 8నవంబర్, 2016న భారత ప్రభుత్వ గెజిట్, ఎక్ట్స్రార్డినరి పార్టీII, సెక్షన్ 3, సబ్ సెక్షన్(ii)ద్వారా తేదీ 8, నవంబర్ 2016, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 9 నుంచి రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
- భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934(2 ఆఫ్ 1934) సెక్షన్ 26, సబ్ సెక్షన్ 2 ప్రకారం ఆ నోట్లు చెల్లనివిగా ప్రకటించడం జరిగింది.
- సబ్ సెక్షన్ 26, సబ్ సెక్షన్(2) నిబంధనల ప్రకారం.. భారతదేశంలోని అన్ని బ్యాంకులు తాజాగా జారి చేయబడిన నిబంధనలను పాటించాలి. ఈ నోట్లను ఎవరికీ చెల్లించకూడదు.
- కేంద్ర ప్రభుత్వం కేంద్ర బోర్డు సిఫార్సుల ప్రకారం.. రద్దు చేసినట్లు ప్రకటించిన నోట్లను ఏ బ్యాంకులు కూడా ఎవరికీ చెల్లించకూడదు, నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఇది అమలవుతుందని నోటిఫికేషన్ ఆఫ్ గెజిట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.