తుపాన్ తో కూలిన ఇల్లు, పెద్ద దిక్కు కన్నుమూత .. చేసిన అప్పు తీర్చలేక చాకిరీకి బాలుడు
చెన్నై : ప్రక్రతి ఆ ఇంటిపై పగబట్టింది. తుపాన్ బీభత్సంతో నీడనిచ్చే ఇల్లు కూలింది. ఇంటి పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేని దుస్థితి. అందుకోసమే అప్పుచేసింది ఆ ఇల్లాలు. అదే ఆమె పాలిట శాపమైంది. తన కొడుకును వెట్టిచాకిరీ చేయించేందుకు దారితీసింది. తమిళనాడులోని తంజావూర్ లో ఈ హృదయవిదారకర ఘటన జరిగింది.
అప్పుతీర్చకపోవడంతో బిడ్డతో చాకిరీ
ఈ ఏడాది జనవరిలో గజ తుపాన్ రక్కసి విరుచుకుపడింది. తమిళనాడులోని తంజావూరులో తుపాన్ ప్రభావం ఎక్కువగానే ఉన్నది. దీంతో ఓ ఇల్లు కూలిపోయింది. దురదృష్టవశాత్తు ఆ ఇంటి యాజమాని ప్రాణాలు కోల్పోయాడు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో అతని భార్య భూస్వామి వద్ద అప్పు చేసింది. తీసుకున్న రూ.36 వేలు గడువులోపు తీర్చలేకపోయింది. దీంతో తన పదేళ్ల కుమారుడిని భూస్వామి వద్ద వెట్టిచాకిరీ కోసం అప్పగించింది.
ఆగిన చదువు .. భూస్వామి వద్దకు బాలుడు
దీంతో చేసేదీమీ లేక ఆ బాలుడు చదువును ఐదో తరగతి మధ్యలోనే ఆపివేశాడు. భూస్వామి వద్ద చాకిరీకి దిగాడు. ఆ పిల్లాడి పట్ల భూస్వామి కఠినంగా వ్యవహరించేవాడు. ఒక్కపూట మాత్రమే భోజనం పెట్టి .. 200 మేకలు కాయించేవాడు. దీంతో ఈ విషయం స్వచ్చంద సంస్థకు తెలియడంతో భూస్వామి వెట్టిచాకిరీ భాగోతం వెలుగులోకి వచ్చింది.
ఏపీ విద్యుత్ సంస్థలే బాకీ .. రూ.2400 కోట్లు ఇవ్వాలన్న ట్రాన్స్ కో సీఎండీ
చాకిరీ నుంచి విముక్తి
స్వచ్చంద సంస్థ రంగ ప్రవేశంతో బాలుడికి విముక్తి కలిగింది. ఈ విషయాన్ని వారు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు బాలుడుని భూస్వామి కబంధహస్తాల నుంచి రక్షించారు. ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం భూస్వామి పరారీలో ఉన్నాడని .. అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.