ముంచుకొస్తున్న తుపాను ముప్పు: తీవ్ర రూపం దాల్చనున్న ‘మోచా’
న్యూఢిల్లీ: ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా.. ఇప్పుడు తుఫాను రూపంలో మరో పిడుగు వచ్చిపడుతోంది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుఫాను ముప్పుపొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.
ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తుపానుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మే 6, 2023 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో, మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

తుపాను మే 8న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అందువల్ల, ఇది దాదాపు ఉత్తరం వైపుగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతున్న సమయంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ తుపాను ఉత్తరదిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ తుపాను ఏర్పడితే దానికి మోచా అని పేరు పెట్టనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. యెమెన్ దేశంలోని పోర్టు నగరం మోచా పేరుమీదుగా పేరు పెట్టినట్లు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుపాను దిశ గురించి మరింత ఖచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండీ వెల్లడంచంది. వచ్చేవారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.
A cyclonic circulation is likely to develop over Southeast Bay of Bengal around 6th May 2023. Under its influence a low pressure area is likely to form over the same region around 7th May. It is likely to concentrate into a depression over Southeast Bay of Bengal on 8th May.… pic.twitter.com/WbErCnwSIT
— ANI (@ANI) May 3, 2023
సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-జూన్ సీజన్లో బంగాళాఖాతంలో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దేశంలో అక్టోబర్-డిసెంబర్ మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుపాను సీజన్ ఉంటుందని పేర్కొంది.
అంతేగాక, పశ్చిమతీరంలోని అరేబియా సముద్రంలో కూడా తుపానులు ఏర్పడుతుంటాయని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే 18 తీరప్రాంత, పరిసర జిల్లాల కలెక్టర్లు, 11 శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు దాని ప్రత్యేక సహాయ కమిషనర్ సత్యబ్రత సాహు బుధవారం తెలిపారు.
-
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications