Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారుణం: మంచినీరు తాగిన దళిత విద్యార్దులు సస్పెండ్

Dalit students drink teacher’s water, dismissed
న్యూఢిల్లీ: దేశంలో ఇంకా కొన్ని చోట్ల కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇందుకు నిదర్శనం రాజస్దాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. అగ్రకులానికి చెందిన ఓ ఉపాధ్యాయుని కోసం ఏర్పాటు చేసిన కుండలోని మంచినీటిని తాగిన పదకొండు మంది దళిత విద్యార్దులను సస్పెండ్ చేశారు.

రాజస్థాన్‌లో బికనీర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. బికనీర్‌కు 70 కిమీ దూరంలో ఉన్న తట్ గ్రామంలో ఈ ఘటన సెప్టెంబర్ 1న జరిగితే ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో పనిచేస్తున్న అగ్రకులానికి చెందిన మంగల్ సింగ్ ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారు. తాను తాగటానికి ఉంచుకున్న నీరును ఈ విద్యార్థులు అంటుకోవటంతో కుండ అపవిత్రమైపోయిందని భావించి మంగళ్‌సింగ్ ఈ విద్యార్థులను సస్పెండ్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్దుల తల్లిందండ్రులు మంగిలాల్, ప్రకాష్ రామ్ మెగ్వాల్ ఇద్దరూ ఉపాధ్యాయుడి ప్రశ్నించగా... తాను తాగటానికి ఉంచుకున్న నీటిని విద్యార్థులు అంటుకోవటంతో కుండ అపవిత్రమైపోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

ఈ విషయంపై తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆర్తీ డోగ్రా మాట్లాడుతూ స్కూలు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, జిల్లా విద్యాశాఖ అధికారి ఇద్దరిని ఆ గ్రామానికి వెళ్లి డిటేల్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+