పట్టాలు తప్పిన జనతా: 30 మంది మృతి, 150 మంది క్షతగాత్రులు
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. రాయ్బరేలీలో డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందగా, మరో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం రాయ్బరేలి బచ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని బచ్రావాన్ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. లోకోమోటివ్ బ్రేక్స్ విఫలం కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.

సంఘటనా స్థలానికి అధికారులు చేరుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకుడు మనోజ్ కుమార్ పాండే చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. నిజానికి, రైలును ఆపే సమయంలో ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఇంజిన్తో పాటు రెండు కంపార్టుమెంట్లు దెబ్బ తిన్నాయి. రెండు కోచ్లు ఒక్కదాన్నొక్కటి ఢీకొట్టాయి. వాటిలో ఒకటి జనరల్ కంపార్టుమెంటు కాగా, మరోటి గార్డ్ కంపార్ట్మెంట్. ప్రమాదం జరిగిన బచ్రావాన్ ప్రాంతం రాయబరేలీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications