Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీలో ఢంకా మోగించిన వేళ- తెరపై సుష్మా స్వరాజ్ కూతురు

Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా విజయఢంకా మోగిస్తోన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిచింది. హస్తినాపురిలో తన ప్రాభవాన్ని, అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్‌ బోణీ కొట్టే పరిస్థితీ కనిపించట్లేదు.

మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

Delhi Assembly Election 2025 Results BJP will not be let down the trust says MP Bansuri Swaraj

ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీజేపీలో జోష్ పెరిగింది. ఈ తెల్లవారు జాము నుంచే ఆ పార్టీ ఢిల్లీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. బాణాసంచా కాల్చారు. స్వీట్లను పంచిపెట్టారు. రంగులు చల్లుకున్నారు. డోలు వాయిస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలను ఎగురవేశారు.

దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అందిస్తోన్న సుపరిపాలన, సమగ్ర దేశాభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.

ఈ విజయంపై భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యురాలు బాన్సురి స్వరాజ్ స్పందించారు. బీజేపీ హెవీ వెయిట్, కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె ఆమె. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఆమెనే ఢిల్లీలో బీజేపీకి చిట్టచివరి ముఖ్యమంత్రి.

ఢిల్లీ ఓటర్లకు బాన్సురీ స్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. విజ్ఞతతో ఓటు వేశారని ప్రశంసించారు. మోదీ పరిపాలన కావాలని ప్రతి ఒక్క ఢిల్లీవాసి కూడా ఎంతగానో కోరుకుంటోన్నారనేది ఈ చారిత్రాత్మక విజయంతో స్పష్టమైందని వ్యాఖ్యానించారు. వారి తీర్పును గౌరవిస్తోన్నామని పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామంటూ బాన్సురి స్వరాజ్ స్పష్టం చేశారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సారథ్యంలో పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ హృదయపూరక కృతజ్ఞతలను తెలియజేస్తోన్నానని, తమపై ఢిల్లీ ఓటర్లు ఉంచిన నమ్మకం వమ్ము కాదని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+