ఇద్దరు బాలికలను రేప్ చేసి.. చెరో రూ.5 చేతిలో పెట్టాడు
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు తన మనవరాళ్ల వయసుండే ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ విషయం ఎవరితోనూ చెప్పవద్దంటూ చెరో 5 రూపాయలు వారి చేతిలో పెట్టాడు.
ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాలం ప్రాంతానికి చెందిన సదరు వృద్ధుడు తన పొరుగింట్లో ఉండే తొమ్మిదేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను స్వీట్లు ఇస్తానని నమ్మించి ఇంట్లోకి పిలిచాడు.

అనంతరం వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలికలు నొప్పితో ఏడుస్తుంటే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ వారికి చెరో రూ.5 ఇచ్చాడు. అయితే ఆ బాలికలిద్దరిలో చిన్నదైన ఐదేళ్ల అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది.
విషయం వినగానే అవాక్కయిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే జరిగిన ఘోరం గురించి మరో బాలిక తల్లిదండ్రులకు కూడా తెలిపారు. అనంతరం వారు వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications