హవాలా గుట్టురట్టు: హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల పాత నోట్లు సీజ్
దేశ రాజధాని ఢిల్లీ కరోల్బాగ్లోని హోటల్పై ఐటీ శాఖ అధికారులు, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. తనిఖీల్లో హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల విలువైన పాత నోట్లు గుర్తించారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోల్బాగ్లోని హోటల్పై ఐటీ శాఖ అధికారులు, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల విలువైన పాత నోట్లు గుర్తించారు. నగదును సీజ్ చేసిన అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన సొమ్ము ముంబై హవాలా నిర్వాహకులదిగా భావిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ స్కానర్లు కూడా గుర్తించని రీతిలో పాత నోట్లను ప్యాక్ చేశారు. ఎక్స్ రే కిరణాలు కూడా వెళ్లనటువంటి రీతిలో నోట్లకు టేపులు, వైర్లు చుట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టుబడిన వ్యక్తులు ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. కాగా, నవంబర్ 8న రాత్రి కేంద్ర ప్రభుత్వం 500, వెయ్యి నోట్లను రద్దు చేసిన తర్వాత పెద్ద మొత్తంలో అక్రమ మార్గాల్లో కొత్త, పాత నోట్లు తరలుతున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications