హవాలా గుట్టురట్టు: హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల పాత నోట్లు సీజ్
దేశ రాజధాని ఢిల్లీ కరోల్బాగ్లోని హోటల్పై ఐటీ శాఖ అధికారులు, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. తనిఖీల్లో హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల విలువైన పాత నోట్లు గుర్తించారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోల్బాగ్లోని హోటల్పై ఐటీ శాఖ అధికారులు, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల విలువైన పాత నోట్లు గుర్తించారు. నగదును సీజ్ చేసిన అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన సొమ్ము ముంబై హవాలా నిర్వాహకులదిగా భావిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ స్కానర్లు కూడా గుర్తించని రీతిలో పాత నోట్లను ప్యాక్ చేశారు. ఎక్స్ రే కిరణాలు కూడా వెళ్లనటువంటి రీతిలో నోట్లకు టేపులు, వైర్లు చుట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టుబడిన వ్యక్తులు ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. కాగా, నవంబర్ 8న రాత్రి కేంద్ర ప్రభుత్వం 500, వెయ్యి నోట్లను రద్దు చేసిన తర్వాత పెద్ద మొత్తంలో అక్రమ మార్గాల్లో కొత్త, పాత నోట్లు తరలుతున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే.