వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవాలా గుట్టురట్టు: హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల పాత నోట్లు సీజ్

దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని హోటల్‌పై ఐటీ శాఖ అధికారులు, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. తనిఖీల్లో హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల విలువైన పాత నోట్లు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని హోటల్‌పై ఐటీ శాఖ అధికారులు, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల విలువైన పాత నోట్లు గుర్తించారు. నగదును సీజ్ చేసిన అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన సొమ్ము ముంబై హవాలా నిర్వాహకులదిగా భావిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ స్కానర్లు కూడా గుర్తించని రీతిలో పాత నోట్లను ప్యాక్ చేశారు. ఎక్స్ రే కిరణాలు కూడా వెళ్లనటువంటి రీతిలో నోట్లకు టేపులు, వైర్లు చుట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టుబడిన వ్యక్తులు ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. కాగా, నవంబర్ 8న రాత్రి కేంద్ర ప్రభుత్వం 500, వెయ్యి నోట్లను రద్దు చేసిన తర్వాత పెద్ద మొత్తంలో అక్రమ మార్గాల్లో కొత్త, పాత నోట్లు తరలుతున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

English summary
The Income Tax Department and Crime Branch of Delhi police, seized around huge amount of Rs 3.25 crore in Delhi's Karol Bagh hotel. The joint operation was conducted by IT department and Crime Branch of Delhi Police in early hours of Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X