'ఢిల్లీలోని జామా మసీదు ఒకప్పుడు జమునా దేవి ఆలయం'
ఢిల్లీ: బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాజ్ మహ్ల ఓ శివాలయమని చెప్పిన ఆయన ఇప్పుడు ఢిల్లీలోని జామా మసీదు కూడ ఒకప్పుడు హిందూ దేవాలయమే అని చెప్పారు.
జామా మసీదు ఒకప్పటి జమునా దేవి ఆలయమని, దానిని మొఘలులు నాశనం చేసి జామా మసీదు కట్టారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరువేలకు పైగా కట్టడాలని మొఘలులు నేలమట్టం చేశారన్నారు.

క్రీ.శ. 17వ శతాబ్దంలో షాజహాన్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారన్నారు. తేజో మహాలయాన్ని తాజ్ మహల్గా మార్చినట్లే జమునా దేవి ఆలయాన్ని జామా మసీదుగా మార్చారన్నారు.












Click it and Unblock the Notifications