త్రిలోక్పురి పరిస్ధితి అదుపులోనే, డ్రోన్లతో గస్తీ(ఫోటోలు)
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని త్రిలోక్పురి ప్రాంతంలో పరిస్ధితి అదుపులోనే ఉందని పోలీసులు చెప్పారు. సోమవారం కూడా 144 సెక్షన్ అమల్లోని ఉందన్నారు. ఆ ప్రాంతంలో పుకార్లు వ్యాపింప జేసే వారి పట్ల కఠినంగా వ్వవహరిస్తామని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ హెచ్చరించారు.
ఘర్షణలు జరిగిన ప్రాంతంలో పోలీసుల మోహరింపు మరికొన్ని రోజులు కొనసాగుతుందని అన్నారు. పరిస్ధితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. పిల్లలు స్కూలకు వెళ్లలేకపోయారని, పాలు, ఇతర నిత్యావసర సరుకులకు ఇబ్బందిగా ఉందని స్ధానికులు చెప్పారు.
పాలు, నిత్యావసర సరుకులు సోమావారం పంచినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ నిత్యావసర సరుకులు కొరత తమకు సమస్యగా మారిందని స్ధానికులు చెబుతున్నారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించామని, పరిస్ధితి ప్రశాంతంగా మారగానే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూఢిల్లీలోని దీపావళి రోజు రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్న త్రిలోక్పురి ప్రాంతంలో పోలీసులు నిఘా కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. రాత్రి సమయాల్లో డ్రోన్ల సహాయంతో పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు.

త్రిలోక్పురి పరిస్ధితి అదుపులోనే, డ్రోన్లతో గస్తీ
న్యూఢిల్లీలోని త్రిలోక్పురి ప్రాంతంలో పరిస్ధితి అదుపులోకి రావడంతో సోమవారం పాలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన ప్రజలు.

త్రిలోక్పురి పరిస్ధితి అదుపులోనే, డ్రోన్లతో గస్తీ
న్యూఢిల్లీలోని త్రిలోక్పురి ప్రాంతంలో పరిస్ధితి అదుపులోకి రావడంతో సోమవారం పాలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన ప్రజలు.

త్రిలోక్పురి పరిస్ధితి అదుపులోనే, డ్రోన్లతో గస్తీ
ఆ ప్రాంతంలో పుకార్లు వ్యాపింప జేసే వారి పట్ల కఠినంగా వ్వవహరిస్తామని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ హెచ్చరించారు. ఘర్షణలు జరిగిన ప్రాంతంలో పోలీసుల మోహరింపు మరికొన్ని రోజులు కొనసాగుతుందని అన్నారు.

త్రిలోక్పురి పరిస్ధితి అదుపులోనే, డ్రోన్లతో గస్తీ
ఛాత్ పూజ, మొహరం సందర్భంగా ఇక్కడ భారీ బందోబస్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో డ్రోన్ల ద్వారా ఘర్షణలు జరిగే ప్రాంతాన్ని పర్యవేక్షించడం మొదటిసారి అని, ఇలాంటి సమయాల్లో టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని అన్నారు.
ఛాత్ పూజ, మొహరం సందర్భంగా ఇక్కడ భారీ బందోబస్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో డ్రోన్ల ద్వారా ఘర్షణలు జరిగే ప్రాంతాన్ని పర్యవేక్షించడం మొదటిసారి అని, ఇలాంటి సమయాల్లో టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని అన్నారు.
త్రిలోక్ పురిలో మూడు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో 13 మంది పోలీసులు సహా 35 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇప్పటికి 70 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications