‘హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలం.. దేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదు’
భారతదేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని అన్నారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని అన్నారు.
అంతేగాక, మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గితే.. జాతీయవాదం కూడా మరుగున పడే ప్రమాదముందని అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సురక్షితంగా ఉందని, హిందువులు ఇంకా ఇక్కడ మెజారిటీ జనాభాగా ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.

లేదంటే ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక సామరస్యం ప్రమాదంలో పడతాయని కేంద్రమంత్రి గిరిరాజ్ హెచ్చరించారు. దేశంలో సుమారు 54 జిల్లాల్లో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిందని, ప్రధానంగా ఉత్తరప్రదేశ్, అసోం, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందని అన్నారు.
ముస్లింలు మెజారిటీ వర్గంగా అవతరిస్తే దేశసమగ్రత, ఐకమత్యానికి భంగం కలిగే అవకాశం ఉందని అన్నారు. కుటుంబ నియంత్రణ అనేది అందరికీ తప్పనిసరిగా వర్తింపజేయాలని అన్నారు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్లో హిందువుల సంఖ్య భారీగా తగ్గిపోగా.. మనదేశంలో మాత్రం ముస్లింల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications