షిండేకు అర్బన్ డెవలప్ మెంట్, ఫడ్నవీస్కు హోం, ఆర్థికశాఖ
వారం రోజుల క్రితం మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇవాళ మంత్రులు శాఖలను కేటాయించారు. షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక శాఖలను తమ వద్ద అట్టిపెట్టుకున్నారు. సీఎం షిండే.. పట్టణాభివృద్ది శాఖను తన వద్ద ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ హోంశాఖ, ఆర్థిక శాఖలను షిండే అప్పగించారు.
దీంతోపాటు షిండే.. సాధారణ పరిపాలన, ఐటీ, సమాచార ప్రసారాల శాఖ, పబ్లిక్ వర్స్క్, రవాణా శాఖ, మార్కెటింగ్, సోషల్ జస్టిస్ అండ్ స్పెషల్ అసిస్టెంట్, రిలీఫ్ అండ్ రిహబిలిటేషన్, డిజాస్ర్ మేనెజ్ మెంట్, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, ఎన్విరాన్ మెంట్ అండ్ క్లైమెట్ ఛేంజ్, మైనారిటీ అండ్ వక్ఫ్ శాఖలను ఇతర మంత్రులకు అప్పగించలేదు. ఫడ్నవీస్కు లా అండ్ జస్టిస్, వాటర్ రీసొర్సెస్, హౌసింగ్ అండ్ ఎనర్టీ శాఖలు ఉన్నాయి. ఈ శాఖలు షిండే, ఫడ్నవీస్ వద్ద నిర్వహించడానికి గవర్నర్ భగత్ సింగ్ కొషియారి ఆమోదం తెలిపారు.
మహారాష్ట్రలో షిండే తిరుగుబాటుతో ఫడ్నవీస్ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కొలువుదీరింది. షిండే ధిక్కారించి.. బీజేపీతో చేతులు కలిపారు. అనూహ్యంగా షిండేకు సీఎం పదవీని బీజేపీ ఆఫర్ చేయగా.. ఫడ్నవీస్ డిప్యూటీగా కొనసాగారు. గతంలో తమకు సీఎం పదవీ ఇస్తే సరిపోయేది కదా అని ఉద్దవ్ థాకరే అన్నారు. ఆ వివాదం సమసిపోయింది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ జరుగింది. కీలక శాఖలను మాత్రం షిండే, ఫడ్నవీస్ తమ వద్దే అట్టి పెట్టుకున్నారు.