జయలలిత పరువు నష్టం దావా: కెప్టెన్కు కోర్టు సమన్లు జారీ
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరపున దాఖలైన పరువునష్టం దావాలో డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 13న జరిగే విచారణ సందర్బంగా కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడులోని విరుదునగర్ సమీపంలో జరిగిన డీఎండీకే పార్టీ సమావేశంలో విజయ్ కాంత్ మాట్లాడుతూ అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించపరుస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి.

విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలు జయలలిత పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వాన్ని చులకనగా మాట్లాడారంటూ తమిళనాడు ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీవిల్లి పుత్తూరు కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణకు మార్చి 2వ తేది గురువారం విజయ్ కాంత్ హాజరుకావాల్సి ఉంది.
అయితే విజయ్ కాంత్ పార్టీ తరపున జిల్లాల వారీగా పర్యటన చేస్తుండటంతో కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఈ సందర్బంలో న్యాయమూర్తి కేసు ఏప్రిల్ 13వ తేదికి వాయిదా వేశారు. ఆ రోజు విజయ్ కాంత్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తు సమన్లు జారీ చేశారు. విజయ్ కాంత్ హాజరుకాని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications