జయలలిత: అదే జరిగితే డీఎంకే ప్రభుత్వం ? బీజేపీ ఆరా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో రాష్ట్రంలో ఏమీ జరుగుతోంది ? అని పత్రిపక్ష డీఎంకే పార్టీ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. జరగరానిది ఎదైనా జరిగితే తాము అన్నింటికి సిద్దంగా ఉన్నామని పరోక్షంగా డీఎంకే పార్టీ నాయకులు కొందరు అంటున్నారు.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి 136 మంది శాసన సభ్యులు ఉన్నారు. డీఎంకే, కాంగ్రెస్ సంకీర్ణకూటమికి 98 మంది శాసన సభ్యులు ఉన్నారు.
ఒక వేళ అన్నాడీఎంకే పార్టీలో మనస్పర్థలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అధిష్టానాన్ని ఒప్పించాలని డీఎంకే పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
తమిళనాడులో అధికారంలోకి రావాలంటే 118 మంది శాసన సభ్యులు అవసరం అవుతుతారు. ఇప్పటికే తమ కంటే చిన్నవాడైన పన్నీరు సెల్వంను సీఎంగా కుర్చొపెట్టడానికి కొందరు సీనియర్లు ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

ఇదే జరిగితే 20 మంది శాసన సభ్యులు డీఎంకేలోకి జంప్ అయితే ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకు డీఎంకే అధిష్టానం సిద్దంగా లేదని విశ్వసనీయ సమాచారం.
అవసరం అయితే ఎన్నికలకు వెళ్లి పూర్తి మెజారీటితో అధికారంలోకి రావాలని, ఇలా శాసన సభ్యులకు గాలం వేస్తే మంచిది కాదని డీఎంకే అధిష్టానం భావిస్తుందని తెలిసింది. మొత్తం మీద డీఎంకేలోకి జంప్ అయ్యి ఆ పార్టీతో జతకట్టడానికి కొందరు అన్నాడీఎంకే పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని అలాంటిది ఏమీ జరగదని అంటున్నారు. ఇప్పటికే సోమవారం జరిగిన శాసన సభ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు వారి మనసులోని మాట పెద్దలకు చెప్పారని సమాచారం. ఇది పార్టీ అంతర్గత సమావేశం అయినందున అన్ని విషయాలు బయటకు చెప్పడం భావ్యం కాదని అన్నాడీఎంకే పార్టీ సీనీయర్లు అంటున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications