సంచలనం: తమిళనాడులో డిఎంకె పాలన, పన్నీర్ కు అందుకేనా?
డిఎంకె పాలన త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో రానుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు.ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశాడు.అన్నాడిఎంకె లోని రెండు వర్గాలు పోటీలు పడి పాలనను
చెన్నై:త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె అధికారంలోకి రాబోతోందని డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్అభిప్రాయపడ్డారు.అన్నాడిఎంకె పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.
డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశాడు. ఈ లేఖలో త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలోనే డిఎంకె పాలన రాబోతోందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పరిపాలన స్థంబించిందని, అధికారం కోసం పార్టీ నాయకులు కుమ్ములాడుకొంటున్నారని ఆయన విమర్శించారు.

సామాన్యులకు భద్రత కరువైందన్నారు. నేరాలు అధికమయ్యాయని ఆయన చెప్పారు.అరియలూరులో నందిని అనే బాలికపై అత్యాచారం జరిపి హత్య చేయడం సభ్యసమాజం తలదించుకొనేలా ఉందన్నారు.
అధికారపక్షంలో రెండు వర్గాలలో ఎవరి మాట వినాలో తెలియక పోలీసులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని ఈ పరిస్థితుల్లో డిఎంకె మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు.
ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వానికి డిఎంకె మద్దతివ్వాలని నిర్ణయించుకోవడం వెనుక ఉద్దేశ్యం కూడ ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.శశికళకు చెక్ పెట్టడంతో పాటు పన్నీర్ సెల్వాన్ని రాజకీయంగా సులభంగా ఎదుర్కోవచ్చనే అభిప్రాయాన్ని డిఎంకె నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications