Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

FASTag: బిగ్ అలెర్ట్.. ఫాస్టాగ్‌ చెల్లింపుల్లో కొత్త రూల్స్..

వాహనదారులకు బిగ్ అలెర్ట్. ఫాస్టాగ్ చెల్లింపులను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ లావాదేవీలు, టోల్ ప్లాజా వద్ద క్యాష్ వినియోగాన్ని సులభతరం చేసేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. సరైన ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇకపై టోల్ చెల్లించాలనుకుంటే క్యాష్ రూపంలో చెల్లించాలనుకుంటే రెండింతలు కట్టాల్సి ఉంటుంది. ఇక యూపీఐ ద్వారా టోల్ చెల్లిస్తే టోల్ కాస్త తగ్గుతుంది. 1.25 రెట్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని తాజా రూల్స్ లో పొందుపరిచారు.

ది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్(MORTH) శాఖ జాతీయ రహదారుల ఫీజు రూల్స్, 2008 ని ఈ మేరకు సవరించాయి. ఫాస్టాగ్ లేని వాహనదారులకు వివిధ రకాలుగా ఛార్జీలను ప్రకటించింది. వారి పేమెంట్ విధానం మేరకు ఛార్జీలను సవరించింది. ఈ విధానం ప్రకారం ఉదాహరణకు.. ఫాస్టాగ్ వాహనదారుడు రూ. 100 చెల్లించాలి. ఫాస్టాగ్ లేని వాళ్లు నగదు రూపంలో అయితే.. డబుల్ ఎమౌంట్ అంటే రూ.200 చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే మాత్రం రూ.125 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని కొత్త నిబంధనలో పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు, క్యాష్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

" జాతీయ రహదారులైన ఉన్న టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ పేమెంట్స్ ను సులభతరం చేయడం.. నగదు లావాదేవీలను నిర్మూలించడం కోసం కేంద్ర ప్రభుత్వం ది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్(MORTH) శాఖ జాతీయ రహదారుల ఫీజు రూల్స్, 2008 ను సవరించింది. ఈ నిబంధన ప్రకారం.. సరైన ఫాస్టాగ్ లేని వాహనదారుడు క్యాష్ రూపంలో టోల్ చెల్లించాలి అనుకుంటే డబుల్ ఎమౌంట్ కట్టాలి. యూపీఐ ద్వారా చెల్లించాల్సి వస్తే మాత్రం రూ. 125 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది"

అలాగే వాహనదారుడి ఫాస్టాగ్‌ లో డబ్బులు ఉండి.. అది సక్రమంగా పని చేస్తున్నా.. టోల్‌ వసూలు వ్యవస్థలో లోపం ఏర్పడితే.. ఫ్రీగా వెళ్లవచ్చు. వాహనదారుడు ఎలాంటి నగదు లేదా యూపీఐ ద్వారా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ తాజా రూల్స్ నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం పేర్కొంది.

Double Toll Sting for Cash Payers No FASTag Pay Twice the Fee from October

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రైవేటు వాహనదారులకు నేషనల్హైవేస్ పై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వార్షిక టోల్‌ పాస్‌ ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రూల్ ప్రకారం సంవత్సరానికి రూ.3,000 చెల్లిస్తే 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+