Marriage: పెళ్లి వేడుకలకు వెళ్లిన యువతి, ఇంటిలో భోజనం చేసిన కొంత సేపటికే ?, ఏం జరిగింది ?
బెంగళూరు/ఉడిపి: యువతి, యువకుడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అందరిని పెళ్లికి రావాలని పెళ్లి పత్రికలు పంచిపెట్టారు. అమ్మాయి పెళ్లికి హాజరుకావాలని బంధువులు చాలా మంది వెళ్లారు. పెళ్లికూతురి ఇంటిలో సాంప్రధాయాల ప్రకారం చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెళ్లికి వెళ్లిన యువతి అంతకు ముందు రోజే శవమైయ్యింది.
Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !
ఇదే పెళ్లికి చాలా దగ్గర బంధువు అయిన యువతి హాజరే కావడానికి పెళ్లికూతురి ఇంటికి వెళ్లింది. పెళ్లికూతురి ఇంటికి వెళ్లిన యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కర్ణాటకలోని ఉడిపి సమీపంలో జోస్నా లూవిస్ అలియాస్ జోస్నా (23) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె దగ్గర బంధువుల పెళ్లి ఫిక్స్ అయ్యింది.
పెళ్లి పనులు చూసుకోవడానికి, తరువాత పెళ్లికి హాజరుకావడానికి జోస్నా మూడు రోజులు ముందుగానే పెళ్లికూతురి ఇంటికి వెళ్లింది. రాత్రి 8.30 గంట సమయంలో జోస్నా పెళ్లి కూతురి ఇంటిలో ఓ వ్యక్తి ఇచ్చిన ఆహారం స్వీకరించింది, తరువాత తీవ్ర అస్వస్థత్ె గురైన జోస్నాను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జోస్నా చనిపోయింది.
Wife: మేడమ్ కు నాలుగో భర్త, సార్ కు రెండో భార్య, ఫామ్ హౌస్ లో పంచాయితీతో ప్రాణాలు ?, క్లైమాక్స్!
పెళ్లికి వెళ్లిన యువతికి ఏం జరిగింది, ఆమె తీసుకున్న ఆహారంో ఏమైనా కలిపారా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. పెళ్లికి అమ్మాయితో పాటు ఎవరెవరు వెళ్లారు, ఆ అమ్మాయితో ఎవరెవరు బయటకు వెళ్లారు ?, ఆ అమ్మాయికి ఎవరు ఫోన్లు చేశారు ?, పెళ్లిలో ఏం జరిగింది అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.