ఫేక్ కరెన్సీ: లక్షల్లో బయటపడింది.. ఎక్కడినుంచి ఇదంతా?
ఢిల్లీలో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత అక్కడక్కడా నకిలీ కరెన్సీ వెలుగుచూస్తూనే ఉంది. అయితే ఇప్పటివరకు వెలుగుచూసిన ఘటనల్లో కంటే మంగళవారం ఢిల్లీలో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ బయటపడింది.
ఢిల్లీలో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6.1లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ వీధుల్లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను తొలుత పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వారి బ్యాగులను పరిశీలించగా.. భారీ మొత్తంలో కొత్త నోట్లు బయటపడ్డాయి.

ఇదంతా నకిలీ కరెన్సీ అని నిర్దారించుకున్న తర్వాతే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో నోట్లను ఎక్కడ ముద్రించారు? దీని వెనుక ఎవరెవరున్నారు? ఎలా రవాణా చేస్తున్నారు? వంటి అంశాలపై పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications