Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూ ప్రజలు దొంగలు: ఫరూఖ్‌, అసెంబ్లీలో దుమారం

Farooq Abdullah Kashmiris thieves remark sparks ruckus in assembly
జమ్మూ: కేంద్రమంత్రి, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా ఆ రాష్ట్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ కార్యకమ్రంలో పాల్గొన్న అబ్దుల్లా.. జమ్మూకాశ్మీర్‌ ప్రజలు పెద్ద దొంగలు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర అసెంబ్లీలో శాసన సభ్యులు సోమవారం ఆయనపై ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష నేత, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (పిడిపి) అధ్యకక్షుడు మహబూబ్‌ ముఫ్తీ మాట్లాడుతూ.. అబ్దుల్లా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.

కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు కాశ్మీరీలను దొంగలనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇదో సిగ్గుమాలిన ఆరోపణగా ఆయన అభివర్ణించారు.

కాగా విద్యుత్‌ బిల్లులు చెల్లించకుండా, దొంగచాటుగా విద్యుత్‌ను వాడుకుంటున్నారని ఓ కార్యకమ్రంలో పాల్గొన్న అబ్దుల్లా జమ్మూ ప్రజలపై ఆరోపణలు గుప్పించారు. అంతేగాక జమ్మూ ప్రజలు దొంగలు కాదు..పెద్ద దొంగలని వాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై జమ్మూ రాష్ట్ర నాయకులతోపాటు ప్రజలు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+