దీపావళి ఎఫెక్ట్: బంగారు వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. పసిడికి డిమాండ్ పెరిగిపోవడంతో ధరలు కూడా పెరిగిపోతున్నాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయలు పెరిగి రూ.32,650కి చేరుకుంది. ఓవర్సీస్లో బంగారం ధరలు పడిపోయినప్పటికీ మనదేశంలో మాత్రం పండగ కారణంగా పెరిగిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పోల్చితే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి రూ.39,530గా ఉంది.
బంగారం ధరలు స్వల్పంగా పెరగడానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు వివరించారు. దీపావళి పండగ కారణంగా పసిడికి డిమాండ్ ఏర్పడటంతో వ్యాపారులు విపరీతంగా బంగారును కొనుగోలు చేశారని చెప్పారు. అయితే మార్కెట్లు బలహీనపడటంతో బంగారు ధరలు పెరిగాయని వారు చెబుతున్నారు.

దేశరాజధాని ఢిల్లీలో 99.9 ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ. 32.650 ఉండగా... 99.5 స్వచ్ఛమైన బంగారం ధర తులం రూ.32,500గా ఉంది. రెండిటి మధ్య తేడా రూ. 150గా ఉంది. ఇదిలా ఉంటే 8గ్రాముల బంగారం ధర రూ.24,900గానే ఉండి ఎలాంటి పెరుగుదల నమోదు చేయలేదు. ఇక వెండి ధర శుక్రవారంతో పోలిస్తే రూ.30 పెరిగింది. కిలో వెండి ధర రూ.39,530గా ఉంది. ఇక వెండి నాణేలు కొనుగోలు, అమ్మకాల విలువ మారలేదు. 100 వెండి నాణేల ధర కొనుగోలు చేయాలంటే రూ.76వేలు ఉండగా.. అదే అమ్మాలంటే రూ.77వేలుగా ఉంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications