Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈవీఎం- వీవీప్యాట్ల రాండమైజేషన్ పై ఈసీ తాజా వ్యూహం

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎం- వీవీప్యాట్ల రాండమైజేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించింది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అస్సాం, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఈవీఎం-వీవీప్యాట్ల మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ ద్వారా రూపొందిన జాబితాలను సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించినట్లు ఈసీఐ పేర్కొంది.

First Randomization of EVMs Completed for Assam Kerala Puducherry and Bye Elections EC Says

వీటితో పాటు ఏప్రిల్ 9న పోలింగ్‌కు వెళ్లే గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని ఉపఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల మొదటి రాండమైజేషన్ కూడా పూర్తయినట్లు తెలిపింది. ఈవీఎంలను వాటి పోలింగ్ స్టేషన్లకు కేటాయించడానికి రెండు దశల రాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తారు. మొదటి దశలో- జిల్లా స్థాయి గోడౌన్ల నుండి ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయిస్తారు. అనంతరం రెండవ దశలో నియోజకవర్గాల నుండి అవి పోలింగ్ స్టేషన్లకు అలొకేట్ అవుతాయి.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా ఎన్నికల అధికారులు ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో ఈవీఎం-వీవీప్యాట్ల మొదటి రాండమైజేషన్‌ను తప్పనిసరిగా పూర్తిచేయాల్సి ఉంటుంది. దీన్ని అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో పూర్తి చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే వ్యవస్థ ద్వారా డీఈఓలు ఈ ప్రక్రియను నిర్వహించారు.

రాండమైజ్ చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్ల నియోజకవర్గాల వారీ జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో వారి జిల్లా ప్రధాన కార్యాలయాల్లో అందజేశారు. వీటన్నింటినీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే సంబంధిత అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ఖరారు అయిన తర్వాత, ఈ జాబితాలు పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా అందజేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+