50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
గో ఫస్ట్ ఎయిర్లైన్స్కు డీజీసీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. జనవరి 9న ఢిల్లీకి వెళ్లే గో ఫస్ట్ విమానం బెంగుళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ విమానంలో వెళ్లాల్సిన 50 మంది ప్రయాణికులను వదిలేసింది.
న్యూఢిల్లీ: ఇటీవల ప్రయాణికులను వదిలేసి విమానం వెళ్లిపోవడం గో ఫస్ట్ ఎయిర్లైన్స్కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. బెంగళూరు విమానాశ్రయంలో సుమారు 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసి గోఫస్ట్ విమానం ఢిల్లీకి వెళ్లిపోయింది. జనవరి మొదటి వారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో గో ఫస్ట్ ఎయిర్లైన్స్కు డీజీసీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. జనవరి 9న ఢిల్లీకి వెళ్లే గో ఫస్ట్ విమానం బెంగుళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ విమానంలో వెళ్లాల్సిన 50 మంది ప్రయాణికులను వదిలేసింది. దీంతో వారంతా షటిల్ బస్సులో బోర్డింగ్ కోసం వేచివుండాల్సి వచ్చింది.
ఈ క్రమంలో ప్రయాణికులు సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి పోస్టు చేశారు. గోఫస్ట్ ఎయిర్ లైన్స్పై తీవ్రంగా మండిపడ్డారు. సంబంధిత అధికారులను ట్యాగ్ చేశారు. తమను ఢిల్లీకి వెళ్లే విమానంలోకి అనుమతించలేదని పేర్కొన్నారు. G8 116 నంబర్ గల విమానం 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసి జనవరి 9 ఉదయం 6:40 గంటలకు బయలుదేరింది.
ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు గో ఫస్ట్ నిరాకరించింది. అయితే, ఒక ట్వీట్కు ప్రతిస్పందనగా.. ఎయిర్లైన్ వినియోగదారులను వారి వివరాలను పంచుకోమని కోరింది. వారు కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు.
అంతకుముందు, ఈ సంఘటనతో ఎయిర్లైన్ ఆపరేటర్కు డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. గో ఫస్ట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించారని మండిపడింది. చాలా విషయాల్లో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొంది.