విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ కూడా ఒకరు.
ఎయిర్ ఇండియా విమాన శకలాల నుంచి మృతదేహాలను వెలికి తీసిన అధికారులు డీఎన్ఏ టెస్టు నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. అయితే ఈ క్రమంలో మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహాన్ని గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఆయన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. దీంతో విజయ్ రూపాణీ అంత్యక్రియలకు ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. జూన్ 15న ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జూన్ 15 ఆదివారం నాటికి 32 మృతదేహాలను గుర్తించారు. వీటిలో 14 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. అయితే మాజీ సీఎం విజయ్ రూపాణీని మృత్యువు వెంటాడిందని చెప్పవచ్చు. తొలుత ఆయన మే 19 తారీఖునే లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ టికెట్ క్యాన్సెల్ అయింది. జూన్ 5 మళ్లీ బుక్ చేసుకోగా అది కూడా క్యాన్సెల్ కావడం గమనార్హం. చివరగా జూన్ 12న టికెట్ బుక్ చేసుకున్నారు. లండన్ లో ఉన్న తన భార్య, కూతురు దగ్గరకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు విజయ్ రూపాణీ.
విజయ్ రూపాణీకు మృదు స్వభావిగా మంచి పేరుంది. ఆయన 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు రెండు సార్లు గుజరాత్ సీఎంగా పనిచేశారు. పాలనలో తనదైన ముద్ర వేశారు విజయ్ రూపాణీ. ఆయన మృతితో రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రముఖులు, వీఐపీలు" విజయ్ రూపాణీ మృతితో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన లక్కీ నంబర్ 1206 అట. విజయ్ రూపాణీ కారు నంబర్, బైక్ నంబర్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు 12 జూన్ అంటే 12-06 తేదీనే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. లక్కీ నంబర్ తేదీ రోజే విజయ్ రూపాణీ మృతి చెందడం బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
అయితే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్ప కూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.
అయితే ఇంతటి ఘోర విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు మాత్రమే బతికి బయట పడ్డాడు. అతడే 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేశ్. అతడు 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కుప్పకూలిన ఘటనలో అందరూ చనిపోగా అతడు మాత్రం స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications