స్టూడెంట్ ను చంపి అడవిలో శవం పాతిపెట్టిన ఫ్రెండ్స్, రాజకీయ నాయకుడి కొడుకు !
చెన్నై/ మధురై: రాజకీయ నాయకుడి కుమారుడు కాలేజ్ లో చదువుతున్నాడు. కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి తాను బయటకు వెలుతున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత అతని ఆచూకిలేదు. రంగంలోకి దిగిన పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేశారు. మాయం అయిన కాలేజ్ అబ్బాయి, రాజకీయ నాయకుడి కొడుకు దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా త్యాగతురుగం సమీపంలో కూతకుడి పంచాయతీ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ జైశంకర్ పని చేస్తున్నాడు. రాజకీయ నాయకుడు అయిన జైశంకర్ కు జగన్ అనే కుమారుడు ఉన్నాడు. కడలూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జగన్ చదువుతున్నాడు. అనారోగ్యం కారణంగా గత వారం రోజులుగా కళాశాలకు వెళ్లకుండా జగన్ ఇంటిలోనే ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం బయటకు వెళ్లి వస్తానని తల్లికి చెప్పి వెళ్లిన జగన్ తరువాత ఇంటికి రాలేదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

తన కుమారుడు జగన్ అదృశ్యమైనాడని రాజకీయ నాయకుడు జైశంకర్ వరంజరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో జగన్ ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ చేసిన స్థలంలో, ఆ టైమ్ లోనే అతని స్నేహితులు అయ్యప్పన్ సహా నలుగురి ఫోన్ నంబర్ల సిగ్నల్స్ కూడా అదే ప్రాంతంలో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో అయ్యప్పన్ సహా నలుగురిపై జగన్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు అనుమానం వచ్చింది.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కలకలం రేపే సమాచారం బయటకు వచ్చింది. అయ్యప్పన్కి, జగన్కి ఇప్పటికే శత్రుత్వం ఉంది. ఈ క్రమంలో అయ్యప్పన్ సహా నలుగురు వ్యక్తులు జగన్ ను తీసుకుని మద్యం తాగేందుకు కూతకుడి అడవికి వెళ్లారు. అక్కడ జగన్ విపరీతంగా మద్యం సేవించడం, మద్యం మత్తులో ఉండటంతో అయ్యప్పన్తోపాటు నలుగురు వ్యక్తులు జగన్ని బాటిల్తో పొడిచి చంపేశారు. అడవిలో జగన్ శవాన్ని పాతిపెట్టినట్లు అయ్యప్పన్ తో పాటు నిందితులు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.
దీంతో పోలీసులు కూతకుడి అటవీ ప్రాంతానికి చేరుకుని పూడ్చిపెట్టిన జగన్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కాళ్లకురిచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అయ్యప్పన్తో పాటు జగన్ స్నేహితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో అడవిలో మందు పార్టీ ఏర్పాటు చేసి జగన్ను పక్కాప్లాన్ తో హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. రాజకీయ నాయకుడి కుమారుడు, కాలేజ్ విద్యార్థి అతని ఫ్రెండ్స్ చేతిలో దారుణ హత్యకు గురికావడం కల్లకురిచ్చిలో కలకలం రేపింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications