వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady: వడ్డీ వ్యాపారం చేస్తున్న మీనా ఆంటీని నమ్మించి పిలుచుకుని వెళ్లి ?, స్మశానవాటికలోనే ?, సీసీటీవీల్లో !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీసుకున్న రుణం చెల్లించకుండా అప్పు ఇచ్చిన మహిళనే దారుణంగా హత్య చేసి శవం పోలీసులకు చిక్కకుండా పూడ్చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ మీనా వాద్వాన్ అలియాస్ మీనా (54) అనే మహిళ హత్యకు గురైంది. జనవరి 2 నుంచి మీనా కనిపించకుండా పోయింది. పోలీసులు మీనా కనపడటం లేదని కేసు నమోదు చేసి అనుమానాస్పదంగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తరువాత వడ్డీ వ్యాపారం చేస్తున్న మీనా ఆంటీ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. వడ్డీ వ్యాపారానికి సంబంధించిన విషయంలో మీనాను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మీనాను హత్య చేసిన నిందితులు తరువాత స్థానిక శ్మశానవాటికలో ఆమె శవం పాతిపెట్టామని చెప్పడంతో మీనా కుటుంబ సభ్యులు హడలిపోయారు.

Reddy: వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న గాలి జనార్దన్ రెడ్డి ?, సేమ్ సీన్ రిపీట్, ఆరోజు వైఎస్ ఫ్యామిలీ, ఇప్పుడు !Reddy: వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న గాలి జనార్దన్ రెడ్డి ?, సేమ్ సీన్ రిపీట్, ఆరోజు వైఎస్ ఫ్యామిలీ, ఇప్పుడు !

వడ్డీ వ్యాపారం చేస్తున్న మీనా

వడ్డీ వ్యాపారం చేస్తున్న మీనా

నార్త్ వెస్ట్ ఢిల్లీలో పూడ్చిపెట్టిన మీనా మృతదేహాన్ని బయటకు తీశారు. మీనా హత్య కేసులోరెహాన్, మోబిన్ ఖాన్, నవీన్‌ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హత్యకు గురైన మీనా వాధ్వన్ వడ్డీ వ్యాపారి. చిరు వ్యాపారులు, దినసరి కూలీలకు వడ్డీలకు అప్పులు ఇచ్చేది. నిందితులు మీనా వద్ద అప్పులు కూడా తీసుకున్నారు. కానీ మీనా దగ్గర అప్పు తీసుకున్న నిందితులు ఆమెకు డబ్బులు తిరిగి చెల్లించలేదు.

మాయం అయిన మీనా

మాయం అయిన మీనా

దీంతో మీనా డబ్బు తిరిగి ఇవ్వాలని వారి మీద ఒత్తిడి తెచ్చింది. దీంతో రగిలిపోయిన నిందితులు ముగ్గురు మీనాను హత్య చెయ్యాలని డిసైడ్ అయ్యారు. మీనా జనవరి 2 వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. మీనా కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. కాసేపట్లో వస్తానని చెప్పి జనవరి 2న ఇంటి నుంచి వెళ్లిన మీనా వాద్వాన్ తరువాత తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. రాత్రి మీనా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.

సీసీటీవీ కెమెరాల్లో ?

సీసీటీవీ కెమెరాల్లో ?

మీనా ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలో కూడా వారికి ఏం జరిగిందనే దానిపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేశారు.

మీనాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు మోబిన్ ను పోలీసులు మొదట ప్రశ్నించారు. అయితే మోబిన్ దర్యాప్తుకు సహాయపడే ఎలాంటి సమాచారాన్ని పోలీసులకు చెప్పలేదు. అనంతరం మరో నిందితుడు నవీన్‌ను పట్టుకున్న పోలీసులు అతన్ని విచారించారు. మోబిన్, రెహాన్‌లతో కలిసి మీనాను హత్య చేసినట్లు నవీన్ అంగీకరించాడు.

నిందితులు ఫ్యామిలీ ఫ్రెండ్స్

నిందితులు ఫ్యామిలీ ఫ్రెండ్స్

ఢిల్లీలోని నంగ్లోయ్ శ్మశాన వాటికలో మీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు కూడా నవీన్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మీనా కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. నిందితులు ముగ్గురి గురించి మాకు బాగా తెలుసని, వీళ్లు మా కుటుంబానికి పరిచయం ఉన్నారని మీనా కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. నిందితులు పూడ్చిపెట్టిన మీనా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

రూ. 5 వేలు తీసుకుని సైలెంట్

రూ. 5 వేలు తీసుకుని సైలెంట్

మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకొచ్చినా అక్కడి రిజిస్టర్ లో వివరాలు నమోదు చేయకపోవడంతో శ్మశానవాటిక సంరక్షకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీనా అంత్యక్రియలు జరిగిన విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండటానికి స్మశానవాటికలో పనిచేసే కాటికాపరి నిందితుల నుంచి రూ.5 వేలు తీసుకున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. తీసుకున్న రుణం చెల్లించకుండా అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి మీనాను దారుణం హత్య చెయ్యడం నార్త్ ఢిల్లీలో కలకలం రేపింది.

English summary
Friends who killed a woman who was running a loan business and buried her body in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X