జీ20: షీ జిన్పింగ్ను చూడగానే లేచి వెళ్లి చేతులు కలిపిన మోదీ... ప్రతిపక్షాల విమర్శలు
ఇండోనేషియాలో జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఎదురుపడ్డారు.
జీ20 సదస్సుకు వచ్చిన నేతల కోసం ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా నరేంద్ర మోదీ, షీ జిన్పింగ్ కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు.
ఈ సదస్సుల్లో చైనా, భారత్ దేశాధినేతల మధ్య అధికారిక సమావేశాలు అయితే లేవు.
2020లో గాల్వాన్ వద్ద భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తరువాత మోదీ, షీ జిన్పింగ్ కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు షాంఘై సమిట్లో ఇద్దరు పాల్గొన్న వ్యక్తిగతంగా కలుసుకోలేదు.
- కృష్ణ: తిరుపతిలో గుండు చేయించుకుని వచ్చాక పద్మాలయ స్టుడియో గేటు దగ్గర ఆపేశారు, అప్పుడు ఏమైందంటే
- రవీంద్ర జడేజా: 'టీమిండియా క్రికెటర్ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చా?’
గాల్వాన్తోపాటు ఇతర సరిహద్దుల్లో భారత్ భూమిని చైనా ఆక్రమిస్తోందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా షీ జిన్పింగ్ను మోదీ కలుసుకోవడాన్ని విమర్శించింది.
గాల్వాన్ ఘర్షణలు, చైనా 'ఆక్రమణల’ మీద నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు.
తాజాగా మోదీ, షీ జిన్పింగ్ కలుసుకున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేయడంతోపాటు గల్వాన్ ఘర్షణల్లో చనిపోయిన వారి పేర్లను కూడా ట్వీట్ చేసింది.
కూర్చొని ఉన్న నరేంద్ర మోదీ, షీ జిన్పింగ్ కనబడగానే లేచి ఆయనతో కరచాలనం చేశారు. ఆ తరువాత కాసేపు మాట్లాడారు. ఇండోనేషియా అధ్యక్ష కార్యాలయం యూట్యూబ్ చానెల్లో ఆ దృశ్యాలు కనిపించాయి.
- పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి
- ఎల్ఎన్జీ అంటే ఏమిటి? యూరప్ ప్రజలకు అది ఎందుకంత కీలకంగా మారింది?
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దీన్ని విమర్శించారు. 'సర్, కళ్లు ఎర్ర చేయలేదే?’ అంటూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేత వినీత్ పునియా కూడా ఆ వీడియోను షేర్ చేశారు.
'కళ్లు ఎర్రజేస్తానని గతంలో అన్నారు. రెండేళ్ల నుంచి చైనా మన భూభాగాన్ని ఆక్రమించి కూర్చొని ఉంది. మరి ఇక్కడ నిలబడి అభినందనలు ఎందుకు చెబుతున్నట్లు?’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
'నోరు లేయాల్సిన చోట... ఆయనే లేచి వెళ్లారు.
కళ్లు ఎర్ర చేయాల్సిన చోట... ఎర్రని కుర్తాను చూపించారు.
మోదీ మాటలు, చేతలు 19 సెకండ్లలో చూడొచ్చు’ అంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ ట్వీట్ చేశారు.
మోదీ, షీ జిన్పింగ్లు చేతులు కలపడాన్ని ఆర్జేడీ యూత్ వింగ్ కూడా విమర్శించింది.
- బిర్సా ముండా జయంతి: సొంత గ్రామం ఎంతగా అభివృద్ధి చెందింది.. ఆయన వారసుల పరిస్థితి ఏంటి
- జాక్వలిన్ ఫెర్నాండేజ్: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో 'మోసపోయిందా’ లేక 'మోసపోయినట్లు నటించిందా’
గల్వాన్లో ఏం జరిగింది?
2020 మే 1న గాల్వాన్ సరిహద్దు వద్ద చైనా, భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వైపులా సైనికులు గాయపడ్డారు. ఆ తరువాత జూన్ 15న మరొకసారి ఘర్షణ జరిగింది.
ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారు. చనిపోయిన తమ సైనికుల వివరాలను చైనా ముందు వెళ్లడించనప్పటికీ ఆ తరువాత నలుగురు చనిపోయినట్లు ప్రకటించింది.
కానీ అంతకంటే ఎక్కువ మందే చనిపోయారని భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు.
గాల్వాన్ ఘర్షణ తరువాత నరేంద్ర మోదీ మాట్లాడారు. సైనికుల త్యాగం ఊరికే పోదు అని అన్నారు. కానీ చైనా పేరు మాత్రం ఆయన ప్రస్తావించలేదు. నాడు ఆ తీరును ప్రతిపక్షాలు విమర్శించాయి.
లేహ్ను సందర్శించి అక్కడ సైనికులను ఉద్దేశించి కూడా మోదీ మాట్లాడారు. చాలా సందర్భాల్లో సరిహద్దు ఆక్రమణలను భారత్ సహించదని ఆయన స్పష్టం చేశారు.
గాల్వాన్ ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలకు చెందిన సైనిక అధికారులు చర్చలు ప్రారంభించారు. విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారు.
దాదాపు రెండేళ్ల పాటు సాగిన చర్చల తరువాత గాల్వాన్లో ఉద్రిక్తతలు కాస్త సద్దుమణిగాయి.
ఇవి కూడా చదవండి:
- 6 వందల కోట్లు, 7 వందల కోట్లకు చేరినప్పుడు పుట్టిన బేబీలను కలిసిన బీబీసీ బృందం
- కతార్ వరల్డ్ కప్: 'మా పిల్లల చావుకు బాధ్యులెవరు?’ - వలస కార్మికుల మరణాలపై కుటుంబాల ప్రశ్నలు
- ఇద్దరూ పెళ్లైనవాళ్లే.. 'ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు’.. నిజామాబాద్ నుంచి యూపీ వెళ్లిన మహిళ, హత్య చేసిన 'లవర్’
- ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు
- పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ప్రియురాలిని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు... 18 రోజుల తరువాత దిల్లీ సిటీలో విసిరేశాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)