గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహాచిత్రాలు విడుదల
సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. 38 రోజుల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సిట్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది.
Recommended Video
బెంగళూరు: సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. 38 రోజుల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సిట్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది.
ప్రజలెవరైనా వీరిని గుర్తిస్తే తమకు తెలియజేయాలని కోరింది. సిట్ ప్రధాన దర్యాప్తు అధికారి బీకే సింగ్ మాట్లాడుతూ.. సిసిటివి ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా ఇరువురు నిందితుల నమూనా చిత్రాలను తయారు చేసినట్లు తెలిపారు.
హత్య జరిగిన ప్రాంతంలో నిందితుడు వారం రోజుల పాటు మకాం వేసి పరిస్థితులు అంచనా వేసినట్లు సిట్ భావిస్తోంది. నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించాడనీ, మోటార్ సైకిల్ను వినియోగించాడని వీడియో క్లిప్ ద్వారా తెలుస్తోందన్నారు.
మోటారుసైకిలు నడిపిన నిందితుడు నేరం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులు 7.65 రైఫిల్స్ను ఉపయోగించడంలో అనుభవజ్ఞులని దర్యాఫ్తు అధికారి చెప్పారు. హత్యకు గల కారణాలపై అన్నికోణాల్లో విచారిస్తున్నామన్నారు.