గీత నా కూతురే: కలిసేందుకు మహిళ దరఖాస్తు
భోపాల్: పదేళ్ల క్రితం భారత్ నుంచి తప్పిపోయి పాకిస్థాన్ చేరిన మూగ, బధిర యువతి గీత ఇటీవలే భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే గీత తల్లిదండ్రులం తామేనంటూ పలు కుటుంబాలు చెప్పినా.. ఎలాంటి రుజువు దొరకలేదు.
తాజాగా గీత తల్లిని తానేనంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్కు చెందిన 40ఏళ్ల అనీసా బీ అనే మహిళ తెలిపింది. గీత తన కుమార్తె నజ్జో అని ఆమె చెబుతున్నారు. నజ్జోకు 13ఏళ్ల వయసున్నప్పుడు నర్సింగ్పూర్ జిల్లాలోని గోటేగావ్ నుంచి తప్పిపోయిందని ఆమె తెలిపారు.

గీతను కలిసేందుకు తనకు అనుమతినివ్వాలని జిల్లా సామాజిక న్యాయ విభాగానికి అనీసా దరఖాస్తు పెట్టుకున్నారు. తన దగ్గర ఉన్న చిన్నప్పటి ఫొటోను దరఖాస్తుకు జతచేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఆమె దరఖాస్తును జిల్లా సామాజిక న్యాయ విభాగానికి అందజేసినట్లు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు. దరఖాస్తును కేంద్రానికి పంపించడం జరుగుతుందని, కేంద్రమే ఈ విషయాన్ని తేలుస్తుందని చెప్పారు. గీతను కలిసేందుకు మరో నాలుగు కుటుంబాలు కూడా గతంలో దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు.
-
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications