Ghaziabad: ప్రాణాలు తీసిన కొరియన్ గేమ్..! 9వ అంతస్తు నుంచి దూకేసిన ముగ్గురు మైనర్లు..!
మొబైల్ యాప్ ల మాయలో పడి చిన్నారులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ (ghaziabad) లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఇందులో అపార్ట్ మెంట్లో ఉంటున్న ముగ్గురు మైనర్లు (బాలికలు) తాము ఆడుతున్న కొరియన్ మొబైల్ యాప్ కారణంగా భవనం 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని ఓ అపార్ట్ మెంట్లో నివసిస్తున్న కుటుంబంలో 12, 14, 16 ఏళ్ల బాలికలు ముగ్గురు ఉన్నారు. వీరి నిన్న అర్ధరాత్రి అంటే ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అపార్ట్ మెంట్ పై నుంచి హఠాత్తుగా దూకి చనిపోయారు. "క్షమించండి, నాన్న. నేను చాలా చాలా ఒంటరిగా ఉన్నాను" అంటూ వారు మాట్లాడిన చివరి మాటలు బయటపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో కొరియన్ యాప్ పాత్రపై వారు ఫోకస్ పెట్టారు.

టాస్క్-ఆధారిత కొరియన్ ఆన్లైన్ గేమింగ్ యాప్ ఆడుతుండటం వల్లే వీరు అందులో ఇచ్చిన టాస్క్ తో ఇలా అపార్ట్ మెంట్ పై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఇంటి యజమాని రెండో భార్య కుమార్తెలు కాగా.. మరో బాలిక మొదటి భార్య కూతురు. ఆత్మహత్య చేసుకున్న బాలికల గదిలో దొరికిన నోట్ లో ఏడుస్తున్న ఎమోజీ పెట్టారు. అలాగే "ఇది నిజమైన జీవిత కథ. ఈజ్ డైరీ మే జో కుచ్ భీ లిఖా హైన్, వో సబ్ పధ్ లో, క్యుంకీ యే సబ్ సచ్ హైన్" (ఈ డైరీలో మీరు ఏమి చూస్తున్నారో, ప్రతిదీ చదవండి, ఎందుకంటే ప్రతిదీ నిజమే) ఇప్పుడే చదవండి! నన్ను నిజంగా క్షమించండి, క్షమించండి నాన్న." అంటూ వారు రాశారు.












Click it and Unblock the Notifications