వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీళ్ల కోసం వెళ్తుండగా ఎత్తుకెళ్లి అమ్మాయిపై అత్యాచారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Girl kidnapped by youth
లక్నో: ఓ అమ్మాయి నీళ్ల కోసం వెళ్తుండగా ఆమెను అపహరించి అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

జిల్లాలోని జోలి గ్రామానికి చెందిన ఓ పదహారేళ్ల దళిత బాలిక నిన్న నీళ్లు తెచ్చేందుకు దగ్గరలోని ఓ చేతి పంపు వద్దకు వెళ్లింది. ఓ యువకుడు ఆమెను అక్కడి నుండి అపహరించి తీసుకు వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం తెలిసుకున్న బాలిక తల్లిదండ్రులు నిందితుడు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాధిత బాలికను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఇటీవల కేంద్రం నిర్భయ చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అత్యాచారానికి పాల్పడినా నిర్భయ చట్టం కింద కేసులు నమోదవుతున్నాయి.

English summary
A sixteen old girl was allegedly raped by a youth at Joli village in the disrict, Police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X