ప్రేమించలేదని కాల్చి చంపేసిన ఉన్మాది
మీరట్: ప్రేమించలేదని, పెద్దలకు ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న ఒక యువకుడు అమాయకురాలైన బాలికను అతి దారుణంగా కాల్చి చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారిస్తున్నారు.
మీరట్ సమీపంలోని నర్ హిరా అనే గ్రామంలో నివాసం ఉంటున్న 16 సంవత్సరాల మహాంశి అనే బాలిక 8వ తరగతి చదువుతోంది. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న యోగేంద్ర (22) అనే యువకుడు బాలికను ప్రేమించడం మొదలు పెట్టాడు.
అయితే బాలిక అతని ప్రేమను నిరాకరించింది. నిత్యం యోగేంద్ర బాలిక వెంట పడి వేధించడం మొదలు పెట్టాడు. స్కూల్ కు వెళ్లి వచ్చే సమయంలో బాలిక విసిగిపోయింది. చివరికి బాలిక తన తాత బల్జిత్ సింగ్ కు విషయం చెప్పింది.
బల్జిత్ సింగ్ యోగేంద్ర కుటుంబ సభ్యులకు విషయం చెప్పి మీ బిడ్డను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న మహాంశిని యోగేంద్ర కాల్చి చంపేశాడు. తరువాత యోగేంద్ర నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లోంగిపోయాడు. యేగేంద్ర సొంతంగా బ్యూటిప్యార్లల్ నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.