గోవా అసెంబ్లీ పోరు-తొలిసారి 12 మంది క్రైస్తవులకు బీజేపీ అవకాశం-40 మందిలో వారే
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో మనోహర్ పరిక్కర్ వంటి నేతల సాయంతో గోవాలో అధికారం సాధించిన బీజేపీకి ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ గోవాలో బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్నాయి. దీంతో బీజేపీ తొలిసారి వ్యూహాలు మార్చుకుంటోంది.
గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన 40 మంది అభ్యర్ధుల జాబితాలో ఏకంగా 12 మంది క్రైస్తవులకు చోటు లభించంది. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ రాష్ట్రంలో తొలిసారి ఇంతమంది క్రైస్తవులకు చోటు కల్పించింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. అటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న పోటీతోనే క్రైస్తవులకు ఎక్కువ సంఖ్యలో బీజేపీ చోటిచ్చినట్లు తెలుస్తోంది. 2012లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఆరుగురు క్రైస్తవులకు మాత్రమే టికెట్లు కేటాయించింది. ఈసారి మారిన పరిస్ధితుల్లో దానికి రెట్టింపు స్ధాయిలో 12 మంది క్రైస్తవులకు చోటివ్వడం విశేషం.

గోవా జనాభాలో 66 శాతం మంది హిందువులే. బీజేపీకి రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో మొత్తం 3.5 లక్షల మందిలో 18 శాతం మాత్రమే హిందువులు. అయినా బీజేపీ ఈసారి దాదాపు 30 శాతం మంది క్రైస్తవులకు ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇవ్వడంతో మారిన రాజకీయ పరిస్దితులు బీజేపీని ఏ స్దాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
బీజేపీ మతతత్వ పార్టీ కాదని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని, ఇందులో భాగంగానే ఇంతమంది మైనార్టీలకు ఈసారి టికెట్లు కేటాయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ తనవాడే ప్రకటించారు. అయితే ఈసారి జాబితాలో బీజేపీ రాష్టంలో 8 శాతం మంది జనాభా కలిగిన ముస్లింల నుంచి ఒక్క అభ్యర్ధికి కూడా సీటు ఇవ్వకపోవడం విశేషం.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications