గోవా అసెంబ్లీ పోరు-తొలిసారి 12 మంది క్రైస్తవులకు బీజేపీ అవకాశం-40 మందిలో వారే
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో మనోహర్ పరిక్కర్ వంటి నేతల సాయంతో గోవాలో అధికారం సాధించిన బీజేపీకి ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ గోవాలో బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్నాయి. దీంతో బీజేపీ తొలిసారి వ్యూహాలు మార్చుకుంటోంది.
గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన 40 మంది అభ్యర్ధుల జాబితాలో ఏకంగా 12 మంది క్రైస్తవులకు చోటు లభించంది. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ రాష్ట్రంలో తొలిసారి ఇంతమంది క్రైస్తవులకు చోటు కల్పించింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. అటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న పోటీతోనే క్రైస్తవులకు ఎక్కువ సంఖ్యలో బీజేపీ చోటిచ్చినట్లు తెలుస్తోంది. 2012లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఆరుగురు క్రైస్తవులకు మాత్రమే టికెట్లు కేటాయించింది. ఈసారి మారిన పరిస్ధితుల్లో దానికి రెట్టింపు స్ధాయిలో 12 మంది క్రైస్తవులకు చోటివ్వడం విశేషం.

గోవా జనాభాలో 66 శాతం మంది హిందువులే. బీజేపీకి రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో మొత్తం 3.5 లక్షల మందిలో 18 శాతం మాత్రమే హిందువులు. అయినా బీజేపీ ఈసారి దాదాపు 30 శాతం మంది క్రైస్తవులకు ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇవ్వడంతో మారిన రాజకీయ పరిస్దితులు బీజేపీని ఏ స్దాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
బీజేపీ మతతత్వ పార్టీ కాదని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని, ఇందులో భాగంగానే ఇంతమంది మైనార్టీలకు ఈసారి టికెట్లు కేటాయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ తనవాడే ప్రకటించారు. అయితే ఈసారి జాబితాలో బీజేపీ రాష్టంలో 8 శాతం మంది జనాభా కలిగిన ముస్లింల నుంచి ఒక్క అభ్యర్ధికి కూడా సీటు ఇవ్వకపోవడం విశేషం.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications