కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ముఖ్యంత్రి పీటంపై పీఠముడి నెలకొంది. సీఎం రేసులో మేమున్నామంటు భాగస్వామ్యపక్షాలు బీజేపీకి సూచించడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి శిరసా వహిస్తామని స్పష్టంచేశారు.
రంగంలోకి గడ్కరీ ..
గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో .. భాగస్వామ్య పక్షాలైన మహారాష్ట్రవడి గోమంతిక్ పార్టీ, గోవా ఫార్వార్డ్ పార్టీ కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సీఎంగా మనోహర్ పారికర్ వ్యవహరించారు. అయితే గత ఏడాది నుంచి ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ .. ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఫోకస్ చేసింది. కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీని రంగంలోకి దింపింది. నిన్న రాత్రే గోవా వెళ్లిన ఆయన బీజేపీ ఎమ్మెల్యేలు .. భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఆయనతోపాటు బీజేపీ కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా మంతనాలు జరిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పక్షాలతో విడతలవారీగా చర్చలు జరిపి .. సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన మీడియాకు మాత్రం తెలియజేయలేదు.

కిస్సా కుర్చీకా ...
గోవా సీఎం పదవీకి తనపేరు పరిశీలించాలని .. ఎంజీపీ నేత సుదీన్ దావలికర్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి చాలా సార్లు వెన్నుదన్నుగా నిలిచానని .. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొన్నిసార్లు పదవీకోసం త్యాగం కూడా చేశానని గుర్తుచేస్తున్నారు. సుదీన్ ప్రతిపాదనను బీజేపీ తోసిపుచ్చింది. ఆయన డిమాండ్ తప్పని .. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలు, గోవా ఫార్వార్డ్ పార్టీ కూడా అంగీకరించదని గోవా బీజేపీ నేత మైఖేల్ లోబో తెలిపారు. సమావేశంలో సుదీన్ .. ప్రతిపాదనకు గడ్కరీ, సంతోష్ అంగీకరించలేదని తెలుస్తోంది. బీజేపీ, భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ గోప్యత పాటిస్తోండగా .. ఇంకా నిర్ణయించలేదని, ఏమైనా జరగొచ్చని సుధీన్ ధీమాతో ఉన్నారు.

అంతర్మధనం ..
సీఎం అభ్యర్థిత్వం కోసం ఎంజీపీ ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా అని బీజేపీ లోలోన మదనపడుతోంది. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందజేస్తామని ... బీజేపీ జాతీయ నాయకత్వం ఎంజీపీతో చర్చిస్తోందని ఆ పార్టీ నేతలు తెలిపారు. సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ హైకమాండ్ దే తుది నిర్ణయమని ఎమ్మెల్యేలు స్పష్టంచేస్తున్నారు.
అసెంబ్లీ రద్దు ..?
గోవాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టేందుకు అసెంబ్లీని రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు గవర్నర్ చేత అసెంబ్లీని రద్దు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ .. అసెంబ్లీ రద్దు ఆలోచన విరమించుకోవాలని గవర్నర్ ను కోరింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications