రోడ్డు ప్రమాదం: కేంద్రమంత్రి గోపినాథ్ ముండే మృతి
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రి గోపినాథ్ ముండే మంగళవారం దుర్మరణం చెందారు. ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుండి ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి కారులో వెళ్తుండగా మరో కారు ఢీకొంది. దీంతో ఆయన గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు జరిగింది.
ప్రమాదం జరగగానే ముండే కారు డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మృతి చెందారు. ఆయన వయస్సు 64. గోపినాథ్ ముండేకు భార్య, ముగ్గురు కుమార్తెలు.
కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఎయిమ్స్ తదితరులు ఎయిమ్స్కు చేరుకున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు ప్రమాదం జరిగిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. ముండే భౌతిక కాయాన్ని మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పార్టీ కార్యాలయానికి సందర్శనార్థం తీసుకు వస్తారని మరో మంత్రి హర్షవర్దన్ చెప్పారు.
<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTUzODg5fHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>