వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘కన్సాస్ కాల్పుల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది’’

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు.

కన్సాస్ లో ఓ శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ యువకుడు అలోక్ కూడా గాయపడ్డాడు.

Govt to Issue Statement on Cansas Incident Next Week

ఈ అంశంపై గురువారం రాజ్య సభలో గందరగోళం నెలకొంది. ఉదయం పార్లమెంట్ ఆవరణలో టీఎంసీ ఎంపీలు అమెరికా దాడులకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన కూడా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రభుత్వం వచ్చే వారం ఒక ప్రకటన చేస్తుందని చెప్పారు. అయినప్పటికీ రాజ్య సభలో గందరగోళం నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

జీఎస్టీ పై మీడియాతో.. మోడీ

వస్తు, సేవల పన్ను బిల్లు అమలుకు తుదిరూపు ఇచ్చే ప్రక్రియ ఈ సమావేశాల్లోనే ముగుస్తుందని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గురువారం పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

జీఎస్టీ అమలు అంశంలో ఉన్న అవరోధాలను అధిగమిస్తామని ఆశిస్తున్నట్లు మోడీ చెప్పారు. జీఎస్టీ అంశంలో అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు పాజిటివ్ దృక్పథంతో ఉన్నట్లు ఆయన తెలిపారు.

English summary
Speaking in Rajya Sabha, Home Minister Rajnath Singh said that the government has taken Kansas shooting incident very seriously and will take steps to ensure that Indians in USA feel secure there. Our government will make a detailed statement in the next week on this incident, says Rajnath Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X