నా భర్తను కలవనివ్వరా: లవ్ జిహాద్ కేసులో హదియా
తిరువనంతపురం: లవ్ జిహాద్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ మహిళ హదియా తిరిగి ఉన్నత చదువులు కొనసాగించాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఆమె చదివే హోమియోపతి మెడికల్ కాలేజీ డీన్ను హదియాకు గార్డియన్గా నియమించింది.
అయితే చదువుకునే సమయంలో హదియా ఆమె భర్త షఫీన్ జెహాన్ను కలువవచ్చా లేదా అనే అంశంపై మాత్రం సుప్రీం నిర్ణయం చెప్పలేదు. దీంతో కోర్టు తీర్పుపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టు తాను అడిగింది ఇవ్వలేదని, కాలేజీ జైలులా ఉందని, తన ప్రాథమిక హక్కులు ఎక్కడ అని ప్రశ్నించారు. నేను ప్రేమించిన వ్యక్తిని కలిసే స్వేచ్ఛ కావాలన్నారు. కాగా, కళాశాల ప్రిన్సిపల్ మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు. ఆమెను కాలేజీలో చేర్పించింది తల్లిదండ్రులు అని కాబట్టి వారే కలువవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications