ఢిల్లీలో భారీ పేలుళ్లలో గుండెను పిండేసే దృశ్యాలు
భారత రాజధాని ఢిల్లీలో జరిగిన అత్యంత భయంకరమైన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య, గాయపడిన వారి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ధాటికి ఏకంగా 9 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బ్లాస్ట్ తీవ్రత ఎంతలా ఉందంటే, మృతుల శరీర భాగాలు ఛిద్రమై కనిపిస్తున్నాయి.
ఈ దృశ్యాలు గుండెను పిండేస్తున్నాయి. ఈ దాడిలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, పేలుడు జరిగిన ప్రాంతంలో 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై, భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడి వెనుక కారణాలపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ ,ఎన్ఎస్జీ బృందాలు చేరుకున్నాయి.
लाल किले के पास कार में विस्फोट....कल फरीदाबाद में 300 किलो विस्फोटक पकड़ा गया था। आखिर क्या हो रहा है ये#Redfort#DelhiBlast pic.twitter.com/lVWstcnkms
— Kalpana Rajauriya (@KalpanaMadam) November 10, 2025
ముంబై, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో హై అలర్ట్
ఢిల్లీలో పేలుడు ఘటన జరిగిన వెంటనే, దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముంబై, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు , ముఖ్యమైన ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు , భద్రతా బలగాలు గట్టి నిఘా ఉంచాయి. ఈ ఘటన దేశ భద్రతకు పెను సవాల్ విసిరింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు , దాడికి కారణమైన వారిపై త్వరలో చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications