వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ లో బీజేపీకి చుక్కలు ? ఓవైపు నిరసనల హోరు-మరోవైపు ఆప్ తో పోరు..

|
Google Oneindia TeluguNews

గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఎలాగైనా విజయం సాధించి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీసి నాలుగు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి ఈసారి పరిస్దితులు పూర్తి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ స్దానంలో గట్టి ప్రతిపక్షంగా మారిన ఆప్ తో ఓవైపు పోరాడుతున్న గుజరాత్ బీజేపీ సర్కార్ కు మరోవైపు ఉద్యోగులతో పాటు ఇతర వర్గాల నిరసనలు తలనొప్పిగా మారిపోతున్నాయి.

పాత పెన్షన్ విధానంపై ఆప్ ఇచ్చిన హామీతో ఉద్యోగులు బీజేపీ సర్కార్ పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలో ప్రతీ చోటా ఇప్పుడు ఉద్యోగులు పాత పెన్షన్ విధానం కోరుతూ బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అలాగే మిగతా వర్గాల్లోనూ గుజరాత్ ప్రభుత్వంపై నమ్మకం సడలుతోంది. దీంతో వారంతా క్రమంగా రోడ్లపైకి వస్తున్నారు. ఎన్నికల ఏడాది వీరిని బుజ్జగించేందుకు భూపేంద్ర పటేల్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో బీజేపీకి ఈసారి అధికారం దక్కడం కష్టమన్న భావన వినిపిస్తోంది.

heavy protests against bjp government in gujarat ahead of assembly polls

గతంలో మత విద్వేషాలతో గుజరాత్ లో రాజకీయాలు చేస్తూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు ఆప్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. దీనికి తోడు ఆప్ ఇస్తున్న హామీలు బీజేపీని కకావికలం చేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఢిల్లీలో ఆప్ నేతలపై సీబీఐ, ఈడీతో కేంద్రం దాడులు చేయిస్తోందన్న ప్రచారం కూడా ఇప్పుడు పెరుగుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కాంలో అరెస్టు చేస్తారంటూ కేజ్రివాల్ మొదలుపెట్టిన మైండ్ గేమ్ బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. దీంతో ఇప్పుడు ఆయన అరెస్టు ఊసే లేదు.

English summary
bhupendra patel led bjp govt in gujarat now facing huge protests just ahead of assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X