హిమాచల్ ప్రదేశ్ లో దారుణం-కొండచరియల కింద బస్సు-32 మంది ప్రయాణికులతో
రెండు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నిగుల్సేరిలో కొండచరియలు విరిగిపడిన ఘటన హృదయవిదారకంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, కనీసం రెండు ఇతర వాహనాలు ఈ ఘటనలో అదృశ్యమయ్యాయి. వీటిని ఇవాళ వెలికి తీశారు.
రెకాంగ్ పియో, రాంపూర్ మధ్య జాతీయ రహదారి పక్కన కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో రోడ్డు కూడా భారీగా కుంగిపోయింది. ఈ ఘటనలో జాతీయ రహదారిపై ఉన్న ప్రయాణికుల బస్సుతో పాటు పలు వాహనాలు ఇందులో పడిపోయాయి. వెలికి తీత చర్యలు చేపట్టగా.. ఇందులో 32 మంది ప్రయాణికులతో కూడిన బస్సు లభ్యమైంది. ఇందులో ఉన్న వారంతా మృత్యువాత పడ్డారు.

కిన్నౌర్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత భారీగా బండరాళ్లు కూడా పడ్డాయి. దీంతో అప్పటికే కొండపై నుంచి బడిన బస్సుతో పాటు ఇతర వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. ఎవరైనా బతికి ఉండే అవకాశాల్నీ తోసిపుచ్చలేమని అధికారులు చెప్తున్నా.. అది అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే విచిత్రంగా ఈ బస్సు నడిపిన డ్రైవర్ మాత్రం బతికి బయటపడ్డాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యల కోసం ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని రప్పించారు. సహాయక చర్యలు పూర్తయితే కానీ ఏమీ చెప్పలేమని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన తర్వాత రెకాంగ్ పియో, రాంపూర్ మధ్య జాతీయ రహదారిపై రాకపోకల్ని నిలిపేశారు. సహాయక చర్యల కోసం వెళ్లే వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్ధితుల మధ్య సహాయక చర్యల్ని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొనసాగిస్తున్నాయి.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications