అస్వస్థతకు గురైన హిమాచల్ ముఖ్యమంత్రి ఆసుపత్రికి తరలింపు
సిమ్లా :హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్ర వీరభద్రసింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి.హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ తో పాటు, పలువురు రాష్ట్ర మంత్రులు ఆయనను పరామర్శించారు.

కొన్ని రోజులుగా వీరభధ్రసింగ్ ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్నారు.దరిమిలా స్వంత ఇంటిలో విశ్రాంతి తీసుకొంటున్నారు.నాలుగు రోజుల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న వీరభద్రసింగ్ ను కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు.ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని ప్రకటించారు వైద్యులు.24 గంటలపాటు తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.












Click it and Unblock the Notifications