క్రిస్మస్ వేడుకలు జరుపుకోవద్దని అలీఘర్ క్రిస్టియన్ స్కూల్కు బెదిరింపులు
అలీఘర్: హిందూ జాగరణ్ మంచ్ అలీఘర్లోని ఓ క్రిస్టియన్ స్కూల్కు హెచ్చరికలు జారీ చేసింది. స్కూళ్లలో క్రిస్మస్ సెలవులు సరికాదని, ఇది మతమార్పిడికి కారణం అవుతుందని వారు ఆరోపిస్తున్నారు.
మతమార్పిడులకు కారణం అవుతున్న క్రిస్మస్ను స్కూల్లో జరుపుకోవద్దని హెచ్చరించారు.

దీనిపై హిందూ జాగరణ్ మంచ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. బొమ్మలు, బహుమతుల ద్వారా తమ తమ స్కూళ్లలో చదువుకుంటున్న హిందు విద్యార్థులను మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
హిందూ జాగరణ్ మంచ్.. హిందూ యువ వాహిని అనుబంధ సంస్థ. హిందూ యువ వాహినిని యూపీ సీఎం ముఖ్యమంత్రి స్థాపించారు. 2002లో ఆయన దీనిని స్థాపించారు.












Click it and Unblock the Notifications