వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మా స్థలంలో మా డబ్బుతో: నాథూరాం గాడ్సేకు గుడి కట్టిన హిందూ మహాసభ
అఖిల భారతీయ హిందూ మహాసభ నాథూరాం గాడ్సెకు గుడిని కట్టింది. గాడ్సే వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
గ్వాలియర్: అఖిల భారతీయ హిందూ మహాసభ నాథూరాం గాడ్సెకు గుడిని కట్టింది. గాడ్సే వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
అంతేకాదు, గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించింది. గుడి కూడా కట్టినట్లు వెల్లడించింది. హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు జైవీర్ భరద్వాజ్ దాదాపు మూడున్నర అడుగుల ఎత్తయిన గాడ్సే ప్రతిమను ఆవిష్కరించారు.
గాడ్సే పేరిట గుడి కట్టడానికి గ్వాలియర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తొలుత హిందు మహాసభకు అనుమతి ఇవ్వలేదు. మా స్థలంలో, మా డబ్బులతో ఈ గుడిని నిర్మిస్తున్నామని, దీనికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయొద్దని భరద్వాజ్ చెప్పారు. గాంధీని కాల్చి చంపిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ మహాసభపై కేసు నమోదు చేయాలని పిలుపునిచ్చింది.
Comments
English summary
Sixty nine years after Father of the Nation Mahatma Gandhi was assassinated, a “shrine” dedicated to his killer Nathuram Godse was set up in Guwalior by the Hindu Mahasabha on Wednesday, kicking off a controversy.
Story first published: Thursday, November 16, 2017, 14:47 [IST]