వైద్య నిర్లక్ష్యానికి ఎన్నారైకి ఆసుపత్రి 11కోట్ల నష్టపరిహారం
వీరి నిర్లక్ష్యం వల్ల 1998లో భార్యను కోల్పోయిన అమెరికాలోని కునాల్ షా అనే ప్రవాస భారత వైద్యుడికి భారీ మొత్తంలో 5.96 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని సుప్రీం కోర్టు గురువారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.
ఓహియోలో ఎయిడ్స్పై పరిశోధనలు చేస్తున్న కునాల్ షాకు ఎనిమిది వారాల్లో ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఈ చెల్లింపు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని జస్టిస్ ఎస్జె ముఖోపాధ్యాయ, జస్టిస్ వి గోపాల గౌడలతో కూడిన ధర్మాసనం ఎఎంఆర్ఐ ఆసపత్రితో పాటు సదరు వైద్యులకు స్పష్టం చేసింది.
అంతకుముందు ఈ కేసును విచారించిన ఎన్సిడిఆర్సి (నేషనల్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్) కునాల్ షాకు 1.73 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని 2011లో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును కునాల్ షా సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
దీంతో సుప్రీం కోర్టు నష్టపరిహార మొత్తాన్ని పెంచడంతో పాటు ఆ మొత్తంపై 6 శాతం చొప్పున వడ్డీ కూడా కునాల్ షాకు చెల్లించాలని ఎఎంఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యాన్ని, సదరు వైద్యులను ఆదేశించింది. నష్ట పరిహారం రూ.5.96 కోట్లకు ఆరు శాతం వడ్డీ చొప్పున మొత్తం రూ.11.41 కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.