200 ఏళ్ల నాటి ఎర్రకోట నెత్తుటి చరిత్ర.. రాచరిక దర్పం నుంచి ఆక్రమణల దాకా..

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే ప్రతీ భారతీయుడికి గుర్తొచ్చేది ఢిల్లీలోని ఎర్రకోట. దేశ ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రసంగించే ఈ చారిత్రక కట్టడం వెనుక ఒక భయంకరమైన గతం ఉంది. మొఘలుల రాజసానికి ప్రతీకగా నిలిచిన ఈ కోట, ఒకానొక కాలంలో తీవ్రమైన ధ్వంసానికి గురై ఆంగ్లేయుల సైనిక స్థావరంగా మారిందంటే నమ్మగలరా? అంతులేని దర్పానికి, ఆ తర్వాత జరిగిన ఆక్రమణలకు సాక్ష్యంగా నిలిచిన ఎర్రకోట పూర్తి చరిత్రపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం.

1857 సిపాయిల తిరుగుబాటు.. ముగిసిన మొఘల్ పాలన

షాజహాన్ చక్రవర్తి నిర్మించిన ఈ ఎర్రకోట దాదాపు రెండువందలు ఏళ్ల పాటు మొఘల్ సామ్రాజ్యానికి గుండెకాయలా భాసిల్లింది. అయితే 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామమైన సిపాయిల తిరుగుబాటు.. ఈ కోట భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను నాయకుడిగా ప్రకటించి విప్లవకారులు పోరాడటంతో, ఆంగ్లేయులు ఢిల్లీపై విరుచుకుపడ్డారు. తిరుగుబాటును దారుణంగా అణచివేసిన బ్రిటిష్ సైన్యం, బహదూర్ షా జాఫర్‌ను బంధించి రంగూన్‌కు తరలించింది. దాంతో మొఘలుల సుదీర్ఘ పాలనకు శాశ్వతంగా తెరపడింది.

How the British Turned Delhi Iconic Red Fort Into a Military Base After the 1857 Indian Revolt Ended

రాజభవనం నుంచి ఆంగ్లేయుల సైనిక బ్యారక్‌గా..

ఢిల్లీని చేజిక్కించుకున్న బ్రిటిష్ పాలకులు ఎర్రకోటను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంలో కోట లోపల ఉన్న అద్భుతమైన మొఘల్ కాలం నాటి భవనాలను, అందమైన ఉధ్యానవనాలను, రాచరిక నివాసాలను దారుణంగా కూల్చివేశారు. కోట ప్రాంగణాన్ని సైనికులు ఉండే బ్యారక్‌లుగా మార్చేశారు. సైన్యానికి అవసరమైన మార్పులు చేస్తూ చారిత్రక కట్టడాల ఆనవాళ్లను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి, నేరుగా బ్రిటన్ రాణి చేతుల్లోకి భారత పాలన వెళ్లడానికి ఈ ఎర్రకోట ఘట్టమే ప్రధాన కారణమైంది.

పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.. ఆరు చరణాల 'వందేమాతరం’ మారుమోగింది
పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.. ఆరు చరణాల 'వందేమాతరం’ మారుమోగింది

స్వాతంత్ర్య ఉద్యమానికి కాగడాగా మారిన ప్రాంగణం

20వ శతాబ్దంలో ఎర్రకోట ప్రాముఖ్యత మరోసారి మారింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన 'ఇండియన్ నేషనల్ ఆర్మీ' యోధులపై ఆంగ్లేయులు ఈ ఎర్రకోటలోనే చారిత్రక విచారణ చేపట్టారు. ఈ విచారణ వార్తలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష మరింత రగిలింది. అప్పటివరకు బ్రిటిష్ సైనిక ఆక్రమణకు చిహ్నంగా ఉన్న ఎర్రకోట, ఈ విచారణలతో స్వేచ్ఛ పోరాటానికి సరికొత్త ఊపిరిగా రూపాంతరం చెందింది.

1947లో భారత్‌లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్‌పోర్ట్‌తో అరబ్ ప్రజలు...
1947లో భారత్‌లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్‌పోర్ట్‌తో అరబ్ ప్రజలు...

ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగురవేయలేదా?

మనందరి భావన ప్రకారం 1947 ఆగస్టు 15న మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఎర్రకోటపై తొలిసారి పతాకావిష్కరణ జరిగిందని అనుకుంటాం. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం ఆగస్టు 15న ఎర్రకోటపై కాకుండా వేరే ప్రాంతంలో వేడుకలు జరిగాయి. ఆ తర్వాతే ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసే సంప్రదాయం నిలకడగా ప్రారంభమైంది. ఒకప్పుడు రాజుల సింహాసనంగా, ఆ తర్వాత పరాయి పాలకుల పటాలంగా మారిన ఎర్రకోట.. నేడు 140 కోట్లకు పైగా ఉన్న భారత ప్రజాస్వామ్యానికి అత్యున్నత ప్రతిరూపంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+