సరిహద్దు ఉద్రిక్తత: తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను రంగంలోకి దించిన ఐఏఎఫ్
న్యూఢిల్లీ: చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నిఘాను పెంచుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) అభివృద్ధి చేసిన రెండు లైట్ కొంబాట్ హెలికాప్టర్(తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు)లను సరిహద్దులో దించింది. సరిహద్దులో చైనా కుట్రలపై ఈ హెలికాప్టర్లు నిఘా పెట్టనున్నాయి.
Recommended Video
ఇండియన్ ఎయిర్ఫోర్స్ మిషన్స్కు ఈ శక్తివంతమైన హెలికాప్టర్లు అండగా నిలవనున్నాయి. హెచ్ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ బుధవారం మాట్లాడుతూ.. ఈ హెలికాప్టర్లు ప్రపంచంలోనే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా భారత భద్రతా దళాల అవసరాల మేరకు ఈ హెలికాప్టర్లను హెచ్ఏఎల్ రూపొందించిందని వివరించారు.
ఇటీవలే వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా.. హెఏఎల్ టెస్ట్ పైలట్, వింగ్ కమాండర్(రిటైర్డ్) సుభాష్ పీ జాన్తో కలిసి ఎత్తైన ప్రాంతం నుంచి ఈ హెలిక్టాప్టర్లో ప్రయాణించారు. ఎత్తైన ప్రాంతాల నుంచి ఈ హెలికాప్టర్లు సమర్థవంతంగా దాడులు చేయగలవు.

ఈ హెలికాప్టర్లు అత్యంత ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కూడా కార్యకలాపాలు సాగిస్తాయి. అంతేగాక, అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా ఈ హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ కాగలవు. అంతేగాక, పగటి పూటనే కాకుండా రాత్రివేళలో కూడా ఈ శక్తివంతమైన హెలికాప్టర్లు నిర్దేశించుకున్న లక్ష్యాలపై ఆయుధాలతో దాడులు చేయగలవు.
కాగా, ఐఏఎఫ్, ఇండియన్ ఆర్మీకి సంయుక్తంగా 160 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల అవసరం ఉంది. ఈ క్రమంలో 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల ప్రారంభ బ్యాచ్ ప్రతిపాదనను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. పర్యవసానంగా, 15 పరిమిత సిరీస్ ప్రొడక్షన్ (ఎల్ఎస్పి) హెలికాప్టర్లకు (ఐఎఎఫ్కు 10, ఆర్మీకి 5) ఐఎఎఫ్ ప్రతిపాదన (ఆర్ఎఫ్పి) జారీ చేసింది. ఇప్పటికే బెంగళూరులోని సంస్థ ఉత్పత్తిని ప్రారంభించింది.
మేలో ఐఏఎఫ్ సులూర్ వద్ద తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సీఏ) రెండవ పోరాట స్క్వాడ్రన్ను అమలు చేసింది.42 స్క్వాడ్రన్లు అవసరం ఉండగా ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 42 మాత్రమే ఉన్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications