రామ మందిరం భారత్లో కాక ఇంకెక్కడ, ఆపలేరు: అఖిలేష్ పార్టీ ముస్లీం నేత
ఢిల్లీ: సమాజ్వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్కు, ఆ పార్టీ నేత, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మునావర్ సలీమ్ రామమందిరం అంశంపై షాకిచ్చారు! అంతేకాదు, రామ మందిరాన్ని భారత దేశంలో కాకుండా ఇంకెక్కడ నిర్మించగలమని ప్రశ్నించారు.
మునావర్ సలీమ్ చౌదరి రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికారు. ఆలయాన్ని నిర్మించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రామ మందిర నిర్మాణాలను ఎవరు ఆపలేరన్నారు. భారత్లో కాకుండా రామాలయాలు ఎక్కడ కట్టగలమన్నారు.

మునావర్ సలీమ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషకు చెందిన నాయకుడు. ఆయన సమాజ్ వాది పార్టీ నేత. ఆ పార్టీ ఆయనను 2012లో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇటీవలే పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ ఆయనను అజంగర్, హత్రాస్, ఈటాల ఇంచార్జీగా నియమించారు.
స్వాగతించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
మునావర్ సలీమ్ చౌదరి వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు లక్ష్మీకాంత్ బాజపాయి స్వాగతించారు. అదే సమయంలో ఆయనకు ఓ సూచన చేశారు. సలీమ్ చౌదరి తన మనసులోని మాటను చెప్పారని, కానీ ఈ వ్యాఖ్యలు చేసే ముందు ఆయన వారి పార్టీకి చెందిన అజమ్ ఖాన్ను అడిగారా అని ప్రశ్నించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications