Illegal affair: నడిరోడ్డులో భార్యను లేపేసిన భర్త, శవం పక్కనే దర్జాగా, భర్తను వదిలేసి అపార్ట్ మెంట్ లో?!
లక్నో/ ఉత్తరప్రదేశ్: పెద్దలు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య అపార్ట్ మెంట్ లో తెలిసివాళ్ల ఇంట్లో వంట పని చేస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఉంటున్న భర్త రాత్రి ఇంటికి వెలుతున్నాడు. అపార్ట్ మెంట్ లో పని చేస్తున్న భార్య ఎప్పుడంటే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెలుతోంది.
తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే ఇంటి నుంచి ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్లి ఆమె ప్రియుడితో కులుకుతోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో గొడవపడిన దంపతులు విడిపోయారు. ఇద్దరు పిల్లలు తండ్రి దగ్గర, మూడో చిన్నారి తల్లి దగ్గర ఉంటన్నారు. భర్తను వదిలేసిన భార్య అపార్ట్ మెంట్ లో పని చేస్తోంది. తనను మోసం చేసి తనకు దూరం అయిన భార్య నా పరువు తీస్తోందని ఆమె భర్త రగిలిపోయాడు.
పని ముగించుకుని స్కూటర్ లో వెలుతున్న భార్యను అడ్డుకున్న భర్త ఆమెను నడిరోడ్డులో కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. భర్త ఆవేశంతో అతని భార్యను చంపుతున్న సీన్ చూసిన స్థానికులు అతన్ని అడ్డుకోవడానికి సాహసం చెయ్యలేకపోయారు. భర్యాను చంపేసిన భర్త పోలీసులు వెళ్లే వరకు ఆమె శవం పక్కనే రోడ్డు మీద దర్జాగా కుర్చోవడంతో స్థానికులు హడలిపోయారు.
ముగ్గురు బిడ్డలు
ఉత్తరప్రదేశ్ లోని ఆలీగంజ్ లో రాజ్ కుమార్ అలియాస్ రాంకీ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 11 సంవత్సరాల క్రితం స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని రాజ్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు సెట్ చేసిన వివాహం చేసుకున్న రాజ్ కుమార్, స్వప్నా దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.
ఎప్పుడంటే అప్పుడు బయటకు వెలుతున్న భార్య
రాజ్ కుమార్, స్వప్నా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త రాజ్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వప్నా అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న తెలిసివాళ్ల ఇంట్లో వంట పని చేస్తోంది.
ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఉంటున్న రాజ్ కుమార్ రాత్రి ఇంటికి వెలుతున్నాడు. అపార్ట్ మెంట్ లో పని చేస్తున్న రాజ్ కుమార్ భార్య స్వప్నా ఎప్పుడంటే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెలుతోంది.
భార్య మీద ఫుల్ డౌట్
తన భార్య స్వప్నా అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే ఇంటి నుంచి ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్లి ఆమె ప్రియుడితో కులుకుతోందని రాజ్ కుమార్ కు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో గొడవపడిన రాజ్ కుమార్, స్వప్నా దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం విడిపోయారు.
భార్య పరువు తీస్తోందని రగిలిపోయిన భర్త
ఇద్దరు పిల్లలు తండ్రి రాజ్ కుమార్ దగ్గర, మూడో చిన్నారి తల్లి స్వప్నా దగ్గర ఉంటన్నారు. భర్త రాజ్ కుమార్ ను వదిలేసిన భార్య స్వప్నా అపార్ట్ మెంట్ లో పని చేస్తోంది. తనను మోసం చేసి తనకు దూరం అయిన భార్య స్వప్నా నా పరువు తీస్తోందని ఆమె భర్త రాజ్ కుమార్ ఇంతకాలం రగిలిపోతున్నా.
నడిరోడ్డులో భార్యను లేపేసిన భర్త
సాయంత్రం 6 గంటల సమయంలో పని ముగించుకుని స్కూటర్ లో వెలుతున్న భార్య స్వప్నా కేంద్రీయ విద్యాలయం సమీపంలో అడ్డుకున్న రాజ్ కుమార్ ఆమెను నడిరోడ్డులో కత్తితో కసితీరా పొడిచి పొడిచి చంపేశాడు. రాజ్ కుమార్ ఆవేశంతో అతని భార్య స్వప్నాను చంపుతున్న సీన్ చూసిన స్థానికులు అతన్ని అడ్డుకోవడానికి సాహసం చెయ్యలేకపోయారు.
భర్యా స్వప్నాను చంపేసిన భర్త రాజ్ కుమార్ పోలీసులు వెళ్లే వరకు ఆమె శవం పక్కనే రోడ్డు మీద దర్జాగా కుర్చోవడంతో స్థానికులు హడలిపోయారు. రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.