Illegal affair: లవ్ మ్యారేజ్, భార్యను చంపేశాడు. భార్య మేనకోడలితో జల్సా ?, హల్వా స్కెచ్ !
చెన్నై/ తంజావూర్/ తిరుపత్తూర్: డ్రైవింగ్ స్కూల్ కు వచ్చి వెలుతున్న కాలేజ్ అమ్మాయిని వలలో వేసుకున్న ఆ డ్రైవింగ్ స్కూల్ యజమాని ఆమెతో ఎంజాయ్ చేశాడు. ప్రియురాలు గర్బవతి కావడంతో విధిలేని పరిస్థితిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. దంపతులకు పాప పుట్టింది. భర్త అతని భార్య పుట్టింటికి వెళ్లి వస్తున్నాడు. ఆ సమయంలో భార్య బందువుతో అతనికి పరిచయం అయ్యింది. భార్య పుట్టింటిలో ఉంటే ఆమె భర్త పరిచయం అయిన యువతితో తిరుగుతూ జల్సా చెయ్యడం మొదలు పెట్టాడు. ప్రియురాలు మోజులో పడిపోయిన భర్త అతని భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యి కిలాడీ స్కెచ్ వేశాడు. నా రెండు మూత్రపిండాలు పాడైపోయాయని, నేను నాలుగు వారాలకంటే ఎక్కువ రోజులు బతకను అని డాక్టర్లు చెప్పారని, మనం ఆత్మహత్య చేసుకుందామని భార్యకు మాయమాటలు చెప్పాడు. మనం ఆత్మహత్య చేసుకుంటే మన పాపను ఎవ్వరూ చూసుకుంటారు, పాప అనాథ అయిపోతుందని భార్య చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడానికి భార్య అంగీకరించకపోవడంతో రగిలిపోయిన భర్త అతని భార్య మీద పెట్రోల్ పోసి చంపేశాడు. బిడ్డను ఎత్తుకున్న భర్త అతని ప్రియురాలితో కలిసిపారిపోయాడు. పోలీసులు వెతుకుతుంటే మరో వీడియో తీసిన భర్త దానిని పోలీసులకు పంపించాడు. నా మూత్రపిండాలు పాడైపోవడంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలు మాయమాటలు చెప్పాడు. పోలీసులకు వీడియో పంపించిన తరువాత కిలాడీ భర్త అతని ప్రియురాలితో కలిసి జ్యువెలరీ షోరూమ్ కు వెళ్లి బంగారు నగలు, బట్టల షోరూమ్ కు వెళ్లి ఖరీదైన దుస్తులు తీసుకుని ఐదు జిల్లాలు దాటిపోయి అక్క ఇల్లు తీసుకుని ప్రియురాలితో జల్సా చేశాడు. సీసీటీవీ కెమెరాల్లో కిలాడీ మొగుడు బండారం మొత్తం బయటకు రావడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కేటుగాడి కథ కంచికి చేరింది.

డ్రైవింగ్ స్కూల్ యజమాని
తమిళనాడులోని తిరుపత్తూర్ సమీపంలో పూవాంకుళంలో సత్యమూర్తి (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తిరుపత్తూరు ఆర్ టీఓ కార్యాలయం సమీపంలో సత్యమూర్తి సొంతంగా డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తున్నాడు. కొత్తూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న పెరియస్వామి కుమార్తె దివ్య (24) మూడు సంవత్సరాల క్రితం బీఎడ్ చదువుతూ అదే సమయంలో సత్యమూర్తి డ్రైవింగ్ స్కూల్ లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్లింది.

విధిలేని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడు
డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చి వెలుతున్న దివ్యాకు మాయమాటలు చెప్పిన సత్యమూర్తి ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు. డ్రైవింగ్ స్కూల్ కు వచ్చి వెలుతున్న కాలేజ్ అమ్మాయి దివ్యాను వలలో వేసుకున్న డ్రైవింగ్ స్కూల్ యజమాని సత్యమూర్తి ఆమెను అదే డ్రైవింగ్ స్కూల్ కార్యాలయంలో ఆమెతో ఎంజాయ్ చేశాడు. ప్రియురాలు దివ్యా గర్బవతి కావడంతో ఆమె పెళ్లి చేసుకోవాలని సత్యమూర్తిని డిమాండ్ చేసింది. విధిలేని పరిస్థితిలో సత్యమూర్తి కాలేజ్ అమ్మాయి దివ్యాను వివాహం చేసుకున్నాడు.

భార్య మేనకోడలిని వలలో వేసుకున్న భర్త
దివ్యాకు పాపపుట్టడంతో ఆమె కొత్తూరులోని పుట్టింటికి వెళ్లింది. భార్య దివ్యా ఆరోగ్యం గురించి ఆరా తియ్యడానికి, ఆమె బాగోగులు చూసుకోవడానికి అప్పుడప్పుడు సత్యమూర్తి అత్తారింటికి వెళ్లి వచ్చాడు. భార్య దివ్యా ఇంటికి వెళ్లి వస్తున్న సత్యమూర్తికి అతని భార్య మేనకోడులు, తిరుప్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రజని (పేరు మార్చడం జరిగింది)తో పరిచయం అయ్యింది.

వీడికి మళ్లీ కాలేజ్ ప్రియురాలు
చెన్నైలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో నర్సింగ్ చదువుతున్న రజని ప్రస్తుతం తిరుప్పూర్ లో ఉంటున్నది. భార్య దివ్యా పుట్టింటిలో ఉండటం, ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో సత్యమూర్తి అతని భార్య దివ్యా బంధువు రజనిని ఇంటికి పిలుచుకుని వెళ్లి ఆమెతో ఏకాంతంగా గపడటం మొదలు పెట్టి ఆమెకు దగ్గర అయ్యాడు. రానురాను ప్రియురాలు రజనికి దాసాహం అయిన సత్యమూర్తి ఆమె అంటే పడి చచ్చిపోయాడు.

భూమి మీద భార్యను లేకుండా చేసి ప్రియురాలితో ఉండాలని స్కెచ్
తన భార్య దివ్యా భూమిమీద ఉంటే తాను రజనిని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని సత్యమూర్తి గ్రహించాడు. తరువాత భార్య దివ్యా ఆత్మహత్య చేసుకునేలా చెయ్యాలని సత్యమూర్తి స్కెచ్ వేశాడు. ప్రియురాలు రజనితో తిరుగుతూ జల్సా చెయ్యడం మొదలు పెట్టిన సత్యమూర్తి ఆమె మోజులో పడిపోయాడు. దివ్యా ఆత్మహత్య చేసుకునేలా చెయ్యాలని ఆమె కిలాడీ భర్త సత్యమూర్తి స్కెచ్ వేశాడు.

మూత్రపిండాలు పాడైపోయాయని నాటకాలు
నా రెండు మూత్రపిండాలు పాడైపోయాయని, నేను నాలుగు వారాలకంటే ఎక్కువ రోజులు బతకను అని డాక్టర్లు చెప్పారని, మనం ఆత్మహత్య చేసుకుందామని సత్యమూర్తి అతని భార్య దివ్యాకు మాయమాటలు చెప్పాడు. మనం ఆత్మహత్య చేసుకుంటే మన పాపను ఎవరుచూసుకుంటారు, పాప అనాథ అయిపోతుందని, నేను ఆత్మహత్య చేసుకోనని సత్యమూర్తికి అతని భార్య దివ్యా చెప్పింది. దివ్యా ఆత్మహత్య చేసుకోవాలని సత్యమూర్తి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

భార్యకు నిద్రమాత్రలు ఇచ్చాడు.... పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు
ఆత్మహత్య చేసుకోవడానికి భార్య దివ్యా అంగీకరించకపోవడంతో సత్యమూర్తి రగిలిపోయిన సెప్టెంబర్ 25వ తేదీన దేవాలయానికి వెళ్లి వద్దామని భార్య దివ్యాకు మాయమాటలు చెప్పి ఆమెను, పాపు పిలుచుకని డ్రైవింగ్ స్కూల్ ఆఫీసులోకి పిలుచుకుని వెళ్లాడు. అక్కడ జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి దివ్యాకు ఇచ్చాడు. మత్తులోకి జారుకున్న దివ్యాను కారులో పిలుచుకుని నిర్జనప్రదేశంలోకి వెళ్లాడు. మత్తులో ఉన్న భార్య దివ్యా మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన సత్యమూర్తి పాపను ఎత్తుకుని పారిపోయాడు.
Recommended Video

ఆంధ్రా బార్డర్ లో ఎంజాయ్
మంటలకు దివ్యా చాలా కాలిపోయి కోమాలోకి వెళ్లిపోయింది. కోమాలో ఉన్న దివ్యా ఏం జరిగింది అనే విషయం పోలీసులకు చెప్పలేకపోయింది. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన దివ్యా తరువాత ప్రాణాలు వదిలేసింది. పాపను ఎత్తుకుని ప్రియురాలు రజనితో కలిసి వేలూరు జిల్లాలోని వాలాజీకి (ఆంధ్రప్రదేశ్ బార్డర్) చేరుకున్న సత్యమూర్తి అక్కడ స్నేహితుడి ఇంటిలో ఉంటూ ప్రియురాలు రజనితో ఎంజాయ్ చేశాడు.

పోలీసులకు వీడియో పంపించి నాటకాలు
పోలీసులు సత్యమూర్తి మీద అతని భార్య దివ్యాను హత్య చేశాడని కేసు నమోదు చేశారు. .ఇదే సమయంలో మా కుమార్తె రజని కనపడటం లేదని, సత్యమూర్తి కిడ్నాప్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు మరో కేసు పెట్టారు. పోలీసులు వెతుకుతుంటే మరో వీడియో తీసిన సత్యమూర్తి దానిని పోలీసులకు పంపించాడు. నా మూత్రపిండాలు పాడైపోవడంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని, దయచేసి నా కోసం వెతకవద్దని ఏడుస్తూ వీడియోలు మాయమాటలు చెప్పి పోలీసులకు ఆ వీడియో పంపించి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సత్యమూర్తి చివరి ఫోన్ కాల్ వేలూరు జిల్లాలోని వాలాజీ నుంచి వచ్చిందని మొబైల్ టవర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు వాలాజీకి చేరుకునే టైమ్ కు సత్యమూర్తి అతని ప్రియురాలు రజని, పాపను పిలుచుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

సీసీటీవీ కెమెరాలతో చిక్కిపోయాడు
పోలీసులకు వీడియో పంపించిన తరువాత కిలాడీ సత్యమూర్తి అతని ప్రియురాలు రజనితో కలిసి జ్యువెలరీ షోరూమ్ కు వెళ్లి బంగారు నగలు, బట్టల షోరూమ్ కు వెళ్లి ఖరీదైన దుస్తులు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. తరువాత తంజావూర్ లో అద్దె ఇంటిని తీసుకున్న సత్యమూర్తి అక్కడ ప్రియురాలు రజనితో కలిసి కాపురం పెట్టాడు.

అనాథ ఆశ్రమంలో పాప, ప్రియురాలు
ఐదు జిల్లాలు తిరుగుతూ తప్పించుకున్న సత్యమూర్తి తంజావూర్ లో అద్దె ఇల్లు తీసుకుని అతని ప్రియురాలు రజనితో జల్సా చేస్తున్నాడని పోలీసులకు తెలిసింది. సీసీటీవీ కెమెరాల్లో కిలాడీ మొగుడు బండారం మొత్తం బయటకు రావడంతో పోలీసులు తంజావూర్ చేరుకుని సత్యమూర్తిని అరెస్టు చేశారు. సత్యమూర్తి కుమార్తెను, అతని ప్రియురాలు రజిని అనాథ ఆశ్రమానికి పంపించిన పోలీసులు సత్యమూర్తికి బెండ్ తీసి జైలుకు పంపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దివ్యాను ఆమె భర్త సత్యమూర్తి ప్రియురాలి వ్యామోహంలో సజీవదహనం చెయ్యడం తమిళనాడులో కలకలం రేపింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications