నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు! ఈ వారంలోనే ప్యాకప్

వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అక్కడక్కడా కురిసిన నైరుతి రుతుపవనాలు ఇక పయనం కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ వారాంతంలో వాయువ్య రాజస్థాన్ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు వాతావరణం అనుకూలంగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సాధారణంగా సెప్టెంబర్ 17 నాటికి వీడ్కోలు పలకడం ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ, అక్టోబర్ 15 నాటికి పూర్తిగా ముగుస్తుంది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలవుతుంది.

సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. కరువు ఛాయలు!

ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటివరకు అంటే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు దేశవ్యాప్తంగా సగటు వర్షపాతంలో దాదాపు 14 శాతానికి పైగా లోటు నమోదైంది. 'ఎల్ నినో' ప్రతికూల ప్రభావం వల్ల ఈసారి రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని వాతావరణ శాఖ మే నెలలోనే అంచనా వేసింది. వానాకాలం ఆఖరుకు వచ్చేసరికి వర్షపాతంలో లోటు 10 శాతం కంటే ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో, దేశంలో కరువు పరిస్థితులు దాపురించే ముప్పు ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో తాగునీటి నిల్వలు, జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశముంది.

IMD Predicts Southwest Monsoon Withdrawal to Begin From West Rajasthan This Weekend
Monsoon: ఊపందుకున్న వర్షాలు.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Monsoon: ఊపందుకున్న వర్షాలు.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్

పంటల సాగు ఓకే.. కానీ దిగుబడిపైనే ఉత్కంఠ!

వర్షాలు తక్కువగా కురిసినప్పటికీ, రైతులు ధైర్యం చేసి ఖరీఫ్ పంటల సాగును వేగంగానే పూర్తి చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి విత్తనాలు వేసిన విస్తీర్ణం కేవలం 1.5 శాతం మాత్రమే తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే సకాలంలో వానలు పడకపోవడం వల్ల పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ 'క్రిసిల్' హెచ్చరించింది. అక్టోబర్ నెలలో పంట చేతికి వచ్చే సమయంలోనే అసలు నష్టం ఎంత అనేది స్పష్టమవుతుందని స్పష్టం చేసింది.

El Nino: సెప్టెంబర్ మూడో వారం నుంచి కరువు?
El Nino: సెప్టెంబర్ మూడో వారం నుంచి కరువు?

ఆ పంటల రైతులకు తప్పని తిప్పలు!

నీటిపారుదల వసతులు సరిగా లేని వర్షాధార ప్రాంతాల్లో సాగయ్యే పంటలపై ఈ వర్షపాత లోటు తీవ్రమైన ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పత్తి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, కంది, వేరుశనగ, సోయాబీన్ పంటలకు తగినంత నీరు అందక దిగుబడి తగ్గే ప్రమాదముందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. రుతుపవనాలు త్వరలోనే ముగియనుండటంతో, భూగర్భ జలాలు తగ్గడం, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆశించిన స్థాయిలో నిండకపోవడం రాబోయే రబీ సీజన్‌పై కూడా ప్రభావం చూపేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+